బాహుబలి సినిమాలో, చేత్తో కన్నబిడ్డను పైకెత్తిపట్టుకుని, తనుమాత్రం ప్రాణత్యాగం చేసిన శివగామినిని చూసి, అబ్బురపడని తెలుగుప్రేక్షకులు ఎవరూ వుండరు.
అలాంటి అలాంటిదే, నిజజీవితంలో జరిగిన ఈ సంఘటన సామాన్య ప్రజల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
విశాఖజిల్లా, చింతపల్లికి చెందిన ఓవ్యక్తి తనబిడ్డకు ఆరొగ్యం బాగాలేకపోవడంతో, చికిత్సకోసం ఒక చేత్తో బిడ్డను పైకెత్తుకుని, ఉదృతంగా ప్రవహిస్తున్న కుడుమసారి వాగుని మెడలోతు నీళ్ళలో ఈదుకుంటూ ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు.
మంగళవారం జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కాగా ఈ సంఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కుడుమసారి వాగుపై వంతెన నిర్మాణం కోసం సంబంధిత అధికారుల్ని హుటాహుటిన ఆదేశించినట్టు తెలుస్తోంది.
దశాబ్దాలుగా దాదాపు 12 గ్రామాలకు చెందిన ప్రజలు పడుతూన్న వెతలకు త్వరలో ముగింపు దొరుకుతుందని ఆశిద్దాం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి