google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: 2021

15, సెప్టెంబర్ 2021, బుధవారం

Weight Loss With Fennel Seeds బరువుని తగ్గించే సోంపు వాటర్

 


బరువుని తగ్గించే సోంపు వాటర్  



 దాదాపు ప్రతీ ఇంటిలో సోంపు గింజల్ని ఉపయోగిస్తూనే ఉంటారు.  శరీర బరువును తగ్గించడానికి కూడా సోంపు ఉపయోగపడ్తుంది. 

సోంపును సాధారణంగా భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్ గా ఇంకా, జీర్ణక్రియ సాఫీగా జరిగేందుకు తీసుకుంటాం. నిజానికి దీనిని రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఇది ఆస్తమా, ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

 సోంపుతో బరువు ఎలా తగ్గుతుంది?

సోంపు లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి జీర్ణక్రియ, జీవక్రియలో సహాయపడతాయి. ఇంకా ఆకలిని కూడా తగ్గిస్తుంది.

ఉదయాన్నే ఒక గ్లాసు సోంపు నీరు తాగడం వల్ల కడుపు నిండిన భావన వస్తుంది. దీంతో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలనే కోర్కె తగ్గుతుంది.

సోంపు వాటర్

ఒక టీస్పూన్ సోంపు గింజలను తీసుకుని, ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఈ నీటిని పరగడుపున ఉదయం నిద్ర లేవగానే తాగడం వల్ల మంచి ప్రయోజనం వుంటుంది.

సోంపు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో సోంపు వాటర్ తీసుకుంటే చాలా మంచింది.

సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటి ఉదయాన్నే తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంచుతుంది. ఎక్కువగా తినకుండా  నిరోధిస్తుంది. దీంతో శరీర బరువు కచ్చితంగా తగ్గుతుంది.

ఫెన్నెల్ ఒక సహజ డిటాక్సిఫైయర్. అందువల్ల భోజనం చేసిన వెంటనే దీనిని తీసుకుంటే బాగా పనిచేస్తుంది. ఇది మన శరీరం నుంచి అనేక టాక్సిన్‌లను తొలగిస్తుంది. 

సోంపులో జింక్, భాస్వరం, మాంగనీస్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇది ఊబకాయంతోపాటు ఇతర వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

ఎస్ట్రాగోల్, ఫెంచాన్, అనెథోల్ వంటివి సోంపులో ఉంటాయి. ఇవి తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడంతో సహాయపడుతాయి. 

సోంపు నీరు తాగడం వలన శరీరంలో ఉండే అదనపు నీరు తొలగిపోతుంది. 


11, సెప్టెంబర్ 2021, శనివారం

వత్తిడి ని తగ్గించే 5 మార్గాలు

 

వత్తిడి ని తగ్గించే 5 మార్గాలు 





ఆహారం:



 మంచి ఆహారం కూడా వత్తిడి ని తగ్గిస్తుంది. బలమైన ఆహారం మన మెదడును చురుగ్గా వుండేలా చస్తుంది. 

ఆహారం వల్ల శరీరం మొత్తం యాక్టివ్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. 

ముఖ్యంగా విటమిన్లు, మినరల్స్, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ వల్ల టెన్షన్ తగ్గే అవకాశం వుంటుంది.

విశ్రాంతి తీసుకోవాలి:



వరుసగా పనులు చేస్తూ ఉన్నాగానీ వత్తిడి పెరుగుతుంది. అందువల్ల దృష్టిని మరల్చుకోవాలి. పనిలో కాస్త బ్రేక్ తీసుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలకు దూరంగా ఉండాలి. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. పనిచసే మధ్య మధ్య పజిల్స్, బోర్డ్ గేమ్స్ ఆడుతుండాలి. ప్రకృతిలో తిరగాలి. ఓ కొత్త పుస్తకం చదవాలి. లేదా నచ్చిన వ్యాపకాన్ని చెయ్యాలి. 

వ్యాయామం:



వ్యాయామం అనేది ఒత్తిడిని జయించేందుకు తిరుగులేని అస్త్రంగా చెప్పుకోవచ్చు. వాకింగ్, రన్నింగ్, మెట్లు ఎక్కడం, దిగడం, పిల్లలతో ఆటలు, సైక్లింగ్, పెంపుడు జంతువులతో ఆటలు, శరీరాన్ని కదిలించే చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు కూడా ఒత్తిడిని జయించేలా చెయ్యగలవు. వ్యాయామం చేసినప్పుడు బాడీలో ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతుంది, ఇది పాజిటివ్ ఫీలింగ్స్‌ని పెంచుతుంది. 

మానవ సంబంధాలు:



 వీలైనప్పుడల్లా అందరితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ఫ్రెండ్స్‌తో మాట్లాడాలి. అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి. 

సన్నిహితులతో సమస్యల్ని పంచుకోవడం ద్వారా సాంత్వన లభిస్తుంది. 

వీలైనంత ఒంటరిగా లేకుండా ప్రకృతితో గడపాలి. స్వచ్ఛమైన గాలిని పీల్చాలి. ఓకే చోట ఎక్కువసేపు ఉండకూడదు

తగినంత నిద్ర:



ఒత్తిడికి అనేక కారణాల్లో ఒకటి నిద్ర లేమి. ఆరోగ్యంగా వుండాలంటే మనం రోజుకు కనీసం 6 గంటలు పడుకోవాలి. అలాగే, విశ్రాంతి కూడా తీసుకోవాలి. మంచి నిద్ర వల్ల శరీరంలో అన్ని అవయవాలు  ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటాయి. బ్రెయిన్ బాగా పనిచేసి, పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. అందువల్ల  ఒత్తిడిని చాలా వరకూ తగ్గించుకోవచ్చు.

10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

సుఖనిద్ర కోసం కొత్త పరికరం! Sleep Aid Device

 


 


 సుఖనిద్ర కోసం కొత్త పరికరం! 

https://draft.blogger.com/blog/post/edit/4450771144974125185/8484826717378697715




ప్రస్తుత ప్రపంచంలో  నిద్రలేమి సమస్యతో ఎన్నో కోట్ల మంది బాధపడుతున్నారు. మానసిక ఆందోళన, లేదా రాత్రి పూట  మొబైల్ ఫోన్ ని ఎక్కువగా వినియోగిస్తుండటం కారణంగా నిద్ర అనేది కరువైపోతోంది.   

దీనికి పరిష్కారంగా  జర్మన్ శాస్త్రవేత్తలు  ఓ కొత్త పరికరాన్ని  కనుగొన్నారు. 

మైక్రో–కరెంట్‌ స్మార్ట్‌ హిప్నాసిస్‌ ఇస్ట్రుమెంట్‌ అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు హైటెక్నాలజీతో రూపొందించారు. 

ఈ పరికరం ముఖ్యంగా తగినంత నిద్ర లేకుండా బాధపడేవారికి ఎంతగానో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి  నిద్రపుచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ఎలా పని చేస్తుంది?

ఈ డివైజ్‌ని చేతితో పట్టుకుని, రిలాక్స్‌డ్‌గా కళ్లు మూసుకుంటే చాలు., మెదడులోని కండరాలను ఉత్తేజపరచి, నిద్రపోయేలా చేస్తుంది. 

ఈ డివైస్  చాలా మరియు  తేలికైనది కూడా.  

మైక్రో–కరెంట్‌ స్మార్ట్‌ హిప్నాసిస్‌ ఇస్ట్రుమెంట్‌  ని సులభంగా ఆపరేట్‌ చేసుకోవచ్చు. దీనిలో వర్కింగ్‌ మోడ్స్‌ ని కూడా అమర్చారు. తీవ్రతను పెంచడానికి లేదా తగ్గించడానికి ప్లస్‌ మైనస్‌ బటన్స్‌ కూడా ఉంటాయి.

ఈ స్లీప్‌ ఎయిడ్‌ పరికరాన్ని కార్యాలయాల్లో, ఇంట్లో, వ్యాపార పర్యటన ప్రాంతాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. 

సుమారు 15 నిమిషాలు వాడితే, తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా నివారిస్తుందని చెబుతున్నారు.

ఈ డివైస్  చేతికి బ్రేస్‌లెట్‌లా వేసుకోవచ్చు. 

ధర ఎంత?

దీని ధర సుమారు 30 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ లో సుమారు రూ. 2,200 వరకు ఉంటుంది.

సరైన నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అనేక రోగాలనుండి ఈ పరికరం కాపాడుతుందని నిపుణులు భావిస్తున్నారు. 


6, సెప్టెంబర్ 2021, సోమవారం

ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం Digestive System

 


ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం 

https://draft.blogger.com/blog/post/edit/4450771144974125185/3033167543883383103


Digestive System

 ఆధునిక ప్రపంచంలో జీవనశైలిలో వచ్చిన పెను మార్పులవల్ల, పూర్తిగా మారిపోయిన ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో జీర్ణ వ్యవస్తకు సంబంధించిన అనేక సమస్యలతో భాదపడ్తున్నారు.  

ప్రతిఒక్కరూ రుచికరమైన ఆహారం కోసమని ముందువెనుక ఆలోచించకుండా జంక్ ఫుడ్ లాంటివి తింటూ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు.

 జీర్ణవ్యవస్థ పనితీరు సరిగా లేకపోతే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆహారం కొద్దిగా తిన్నాగానీ గ్యాస్ట్రిక్, అజీర్తి, కడుపు నొప్పి, కడుపులో మంట లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. 

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం ప్రతి ఒక్కరు తేలిగ్గా పాటించగల పద్దతులను కొన్ని ఉన్నాయి . వాటి గురించి తెలుసుకుందాం.

* ఫైబర్ పదార్థాలు



పళ్లు, తృణధాన్యాలు, కూరగాయలు లాంటి ఫైబర్ ఎక్కువ పదార్థాలున్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును పెంచుకోవచ్చు. వాటివల్ల సులభంగా జీర్ణ ప్రక్రియ జరుగుతుంది. ఇవి మలబద్ధకం, అతిసారం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను నివారిస్తాయి.

* ఆహారాన్ని నమలడం 



మనలో చాలామంది ఆహారాన్ని సరిగ్గా నమలరు. దీంతో ఆ పదార్థాలు అరగడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆరోగ్య కరమైన జీర్ణ వ్యవస్థ కోసం మీరు ఆహారాన్ని మెత్తగా నమలాలి. అప్పుడే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

* ఆరోగ్యకరమైన జీవనశైలి



మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.  కంటికి ఇంపుగా కనిపించింది కదాని వేళాపాళా లేకుండా ఆహారాన్ని భుజించకూడదు.

* మాంసాహారాన్ని తగ్గించాలి



జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది.  మరీ అంతగా తినాలని వున్నపుడు కొవ్వులు ఎక్కువ లేకుండా ఉండే మాంసం తినాలి.  సాధారణంగా మాంసాహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది ఇది మలబద్ధకానికి దారి తీస్తుంది. మటన్ కంటే చికెన్ కాస్త బెటర్ 

*  తగినంత నీరు తప్పనిసరి



ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం తరచూ నీరు తాగుతుండాలి. ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది.  ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో నీరు చాలా ఉపయోగపడుతుంది.

5, సెప్టెంబర్ 2021, ఆదివారం

సూపర్ ఫీచర్స్‌తో వన్‌ప్లస్ ఇయర్ బడ్స్ ప్రో One Plus Ear Buds

  సూపర్ ఫీచర్స్‌తో వన్‌ప్లస్ ఇయర్ బడ్స్ ప్రో

https://draft.blogger.com/blog/post/edit/4450771144974125185/5123147394543264994




వన్‌ప్లస్ తన ఇయర్‌బడ్స్ బడ్స్ ప్రోని విడుదల చేసింది. 

ఆగస్టు 26 నుండి ప్రోడక్ట్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 

ప్రస్తుతానికి వైట్, మాట్టే బ్లాక్ కలర్ ఎంపికలలో వన్‌ప్లస్ బడ్స్ ప్రో లభిస్తోంది. వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం..

నాయిస్ రిడక్షన్!

ఈ ఇయర్ బడ్స్ లో ప్రత్యేకత నాయిస్ రిడక్షన్. అంటే కేవలం కాల్స్ లో వాయిస్, ప్లే అవుతున్న పాటలు తప్ప, ఇతర రకాల శబ్దాలు ఏవీ వినిపించవు. ఎటువంటి శబ్దాలనూ వినిపించానీయదు.  అందువల్ల సంగీతం, కాల్స్ లో స్పష్టత వుంటుంది. 

ఇది మూడు మోడ్‌లతో వస్తుంది..  ఎక్స్‌ట్రీమ్, ఫెంట్ ,స్మార్ట్.  ఇయర్ బడ్స్ 25ద్భ్ వరకు శబ్దాన్ని అదుపుచేస్తాయి. 

ఇది కాకుండా, బడ్స్‌లో ఇచ్చిన స్మార్ట్ మోడ్ ఆటోమేటిక్‌గా చుట్టుపక్కల సౌండ్‌ను తగ్గిస్తుంది.

కాలింగ్ కోసం, ప్రీసెట్ మోడ్‌తో వచ్చే మూడు మైక్రోఫోన్‌లు వాటిలో అమర్చారు. ఈ ప్రీసెట్ మోడ్‌లు సాఫ్ట్‌వేర్ అల్గోరిథంల సహాయంతో అవాంఛిత శబ్దాన్ని తగ్గిస్తాయి. 

బడ్స్ ప్రోతో వచ్చే ఛార్జింగ్ కేసు ఈఫ్X4 రేటింగ్‌తో వస్తుంది, కనుక కొంత వరకు వాటర్ ప్రూF గా ఉంటుంది. అదే సమయంలో, ఈఫ్55 రేట్ కలిగిన బిల్డ్ నాణ్యత కారణంగా, ఇది డస్ట్ ప్రూఫ్ గా కూడా వుంటుంది.

వన్ ఫ్లుస్ బడ్స్ ప్రో ప్రత్యేక ఫీచర్లు   

బడ్స్ ప్రో సౌండ్ కోసం 11మ్మ్ డైనమిక్ డ్రైవర్లతో వస్తుంది. ఆడియో నాణ్యతను అందించడానికి, కంపెనీ డాల్బీ అట్మోస్ సపోర్త్ తో వస్తోంది. 94 ఎంఎస్ లటెన్సీ రేటు వల్ల ఈ ఇయర్‌బడ్‌లు గేమింగ్‌కు గొప్పగా ఉంటాయి. 

 ఈ ఇయర్ బడ్ బ్యాటరీకి 38 గంటల బ్యాకప్ ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో, ప్రతి ఇయర్‌బడ్‌ల బ్యాటరీ 10 గంటల వరకు చార్జింగ్ ఉంటుంది, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

 ఓనెఫ్లుస్ తన వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లకు మొదటిసారిగా జెన్ మోడ్‌ని జోడించింది.

ధర ఎలా వుంది 

ఇండియాలో  ఇయర్ బడ్స్ ధరను కంపెనీ 9990 రూపాయలుగా నిర్ణయించింది.  

ఆగస్టు 26 నుండి కంపెనీ తన అమ్మకాలను ప్రారంభించింది. వినియోగదారులు అమెజాన్ ఇండియాతో పాటు, ఒన్ ప్లస్  అధికారిక వెబ్‌సైట్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ నుండి ఓనెఫ్లుస్ బడ్స్ ప్రోని కొనుగోలు చేయవచ్చు. 


కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే...How to protect kidney

 


కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే...


https://draft.blogger.com/blog/post/edit/4450771144974125185/7383240282812072058


 కిడ్నీలు జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చే వ్యర్థాలను, అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్‌ స్థాయిలను నియంత్రిస్తాయి. ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎములకు భరోసా ఇస్తాయి. 

అయితే  కిడ్నీల విషయంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల ప్రతి సంవత్సరమూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇండియాలో ప్రతి సంవత్సరంల రెండున్నర లక్షల మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి ఏటా మూడున్నరకోట్ల మందికి డయాలసిస్‌ చేయాల్సి వస్తోంది. ఖిడ్నీ సమస్యలతో మరణించేవారి సంఖ్య కూడా వేలల్లో ఉంటొంది.

ముఖ్యంగా మహిళలైతే పని ధ్యాసలో పడి కిడ్నీల విషయాన్ని మర్చిపోతున్నారు!

‘ది లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌’ నివేదిక ప్రకారం.. మన దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. వీటన్నింటికి కారణం మనం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోకపోవడమే.

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో  కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. 

తినే ఆహారం, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల చలామందిలో కిడ్నీలు ఫైల్యూర్ అవుతున్నాయి.

కిడ్నీ సమస్యను గుర్తించడం ఎలా..?

మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా, కాళ్లవాపు బాగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లే గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. 

కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం, ఆకలి బాగా తగ్గిపోతుంది. అలసట, తరచుగా వికారం రావడం, వాంతులు చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. 

కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఎఫెక్ట్‌ పడుతుంది. మెదడుకు సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.  

కిడ్నీలు ఉండే భాగంలో నొప్పిగా ఉంటూంది.  

కిడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్ళు ఏర్పడటం జరుగుతాయి.  

ఇలాంటి లక్ష్ణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

కిడ్నీ సమస్యకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

* రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి

* క్యాప్సికంలో ఉండే విటమిన్‌ A, C, పోటాషియం తదితర పోషకాలు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి.

* నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

* బెర్రీలలో ఫైబర్‌, విటమిన్లు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. శరీరంలో ఉండే మలినాలు బయటకు పోయేలా చేస్తాయి. వీటిని తరచూ తీసుకుంటూ ఉండాలి. 

* ఓట్స్‌, కాలిఫ్లవర్‌, ఉల్లిపాయలు, పైనాపిల్స్‌ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.

* మూత్రం వచ్చినపుడు వెంటనే వెళ్లాలి. లేకపోతే కిడ్నీపై ప్రభావం చూపుతుంది.




4, సెప్టెంబర్ 2021, శనివారం

చెడు కొలెస్ట్రాల్‌‌‌కు ఇంజెక్షన్ రూపంలో సరికొత్త ఔషధం..

Cholesterol Drug

 

 


చెడు కొలెస్ట్రాల్‌‌‌కు ఇంజెక్షన్ రూపంలో సరికొత్త ఔషధం.. 

చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రస్తుతం స్టాటిన్స్ అనే ఔషధాన్ని ఇస్తుంటారు. అయితే దీనిని తరచూ తీసుకోవాల్సి వుంటుంది. కానీ కొత్తగా వచ్చిన ఓ ఔషదం  సంవత్సరానికి రెండుసార్లు తీసుకుంటే సరిపోతుంది.

శరీరంలోని చెడు కొలస్ట్రాల్ తో భాదపడ్తున్న రోగులకు  ఓ గుడ్‌న్యూస్ వచ్చింది.

ఇంజెక్షన్ రూపంలో అందుబాటులోకి వచ్చిన  ఈ మెడిసిన్‌తో చెడు కొలెస్ట్రాల్‌ బాధితులకు విముక్తి లభించే అవకాశం వుందని  నిపుణులు పేర్కొంటున్నారు. 

దీనికి ‘ఎక్లిసిరెన్’ అని పేరు పెట్టారు. అయితే ఈ ఇంజెక్షన్‌ను సంవత్సరానికి రెండుసార్లు తీసుకోవాలి. దీనిని యూకే ఆరోగ్య సంస్థ ఎన్‌హెచ్‌ఎస్ బుధవారం నుంచి ప్రారంభించింది. నిపుణులు దీనిని ‘గేమ్ చేంజింగ్’ ట్రీట్మెంట్ గా పేర్కొంటున్నారు.

కొత్త ఇంజెక్షన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది..

ఈ కొత్త ఇంజెక్షన్ వల్ల చెడు కొలెస్ట్రాల్50 శాతంవరకు తగ్గిపోతుంది.

రక్త నాళాలలో కొవ్వు ఎక్కువగా పెరుకుపోయినపుడు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ధమనులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. 

 చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడే వారు ప్రతీ 6 నెలలకు ఎక్లిసిరిన్ ఇంబెక్షన్ వేసుకోవాల్సి ఉంటుంది. దీనివలన తరచూ తీసుకునే కొలెస్ట్రాల్ మెడిసిన్  నుంచి  ఉపశమనం లభించనుంది. కొత్త ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత రోగులలో కొలెస్ట్రాల్ 50 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

 ఇది గుండె జబ్బులను నిరోధించి, ప్రాణాలను కాపాడేందుకు ఎంతో  ఉపయోగకరంగా వుంటుందని తెలుస్తోంది.   ఈ కొలెస్ట్రాల్ ఇంజెక్షన్‌ స్టాటిన్స్ కంటే చాలా ప్రభావవంతమైనది. కొన్ని కారణాలతో మెడిసిన్ తీసుకోలేని వారు కూడా ఈ ఇంజెక్షన్‌ను వేసుకోవచ్చు.

ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుంది..

ఈ ఇంజెక్షన్‌ PCSK9 అనే ప్రోటీన్‌ను నిరోధించడం ద్వారా కాలేయం, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. PCSK9  ప్రోటీన్ కారణంగా శరీర అవయవాలు కొలెస్ట్రాల్‌ను తొలగించలేకపోతుంటాయి. కొత్త ఇంజెక్షన్‌తో ఈ ప్రోటీన్‌ను అడ్డుకోవడం చాలా సులభం. 

దీనివలన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడంతో, వ్యాధులు సంభవించే ప్రమాదం కూడా తగ్గుతుంది.

ఇంజెక్షన్‌ ధర..

ఒక ఇంజెక్షన్ ఖరీదు దాదాపు రూ .2 లక్షలు వుండొచ్చని అనుకుంటున్నారు . దీనిని సంవత్సరానికి రెండుసార్లు చేసుకోవాల్సి ఉంటుంది.  అంటే ఏటా దాదాపు రూ .4 లక్షలు ఇంజెక్షన్‌ల కోసం చెల్లించాల్సి ఉంటుంది.


3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

వెల్లుల్లితో ఉపయోగాలు Garlic Ayurveda




Garlic-Ayurveda

 వెల్లుల్లితో ఉపయోగాలు

వంటల్లో మాత్రమే కాదు. ఆరోగ్యాన్ని అందించడంలో కూడా వెల్లుల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 

వెల్లుల్లి మొత్తం శరీరంలోని 22 రకాల వ్యాధులనుంచి రక్షణ ఇస్తుంది. అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో వెల్లుల్లి ప్రస్తావన ఉంది.

 వెల్లుల్లిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ.   ప్లేగు వ్యాధిని తగ్గిస్తుంది. కొవ్వుని కరిగిస్తుంది. అలాగే కడుపులోని చెడు బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. కోలెస్టరాల్‌ని,  కేన్సర్ ను అదుపులో వుంచుతుంది. అధిక రక్త పోటుని నివారిస్తుంది. ఇంకా వెల్లుల్లి జీర్ణశక్తిని పెంచుతుంది. 

 ఇక ఆస్తమా, శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.  సుగర్ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది.  

వెల్లుల్లిలో అనేక పోష‌కాలు ఇంకా ఔష‌ధ గుణాలు ఉంటాన్నాయి.  

ఇలా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు పొందాలంటే వెల్లుల్లిని ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకుందాం.

రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను నేరుగా అలాగే నమిలి తిన‌వ‌చ్చు.

ఉదయాన్ని పరగడుపున వెల్లుల్లి ర‌సం తాగ‌వ‌చ్చు.

పచ్చిగా తినలేనివారు  వెల్లుల్లి రెబ్బలను కాల్చి తినవచ్చు.

పెనం మీద కొంచెం నెయ్యి వేసి, అందులో వెల్లుల్లి వేయించి తినవచ్చు.

వెల్లుల్లి కషాయంలా చేసుకుని తాగవచ్చు. ముందుగా  రెండుమూడు వెల్లుల్లి రెబ్బ‌లు  తీసుకుని నీటిలో  మ‌రిగించి ఆ నీటిని రోజుకు 2 సార్లు క‌ప్పు మోతాదులో తాగ‌వ‌చ్చు.

ఇలా వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.  

చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

లివర్ సమస్యలున్నారు వెల్లుల్లి తింటే ఎంతో మంచిది.

వెల్లుల్లిని తిన‌డం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.

 వెల్లుల్లి  టాబ్లెట్స్ రూపంలో కూడా మార్కెట్ లో లభిస్తున్నాయి.  రోజూ తినే ఆహారంలో వెల్లుల్లిని ఏదొక రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు.


సామ్‌సంగ్‌ కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌ Samsung Galaxy A52s 5G


https://draft.blogger.com/blog/post/edit/4450771144974125185/587239385056141826


 సామ్‌సంగ్‌ కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌ తాజాగా మార్కెట్లోకి గ్యాలక్సీ A52S పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.

సామ్‌సంగ్‌ గెలాక్సీ A52S 5జీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే అందించారు. 

ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీని ప్రత్యేకత.

A52S 6జీబీ ర్యామ్ + 128జీబీ, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్లలో అందుబాటులోవుంటుంది. 

మైక్రో ఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ కెమెరాను అమర్చారు. 

ఈ ఫోన్‌లో 25 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 4,5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై నడుస్తుంది. 

6జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.35,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,499గా నిర్ణయించారు. 

శాంసంగ్ A52s  5G స్మార్ట్‌ ఫోన్‌ సేల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. 



2, సెప్టెంబర్ 2021, గురువారం

బిట్​కాయిన్​ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? WHAT IS CRYPTOCURRENCY AND BITCOIN?



what is cryptocurrency, about bitcoin


 WHAT IS CRYPTOCURRENCY AND BITCOIN

బిట్​కాయిన్​ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా హాట్​టాపిక్​గా మారిన అంశాల్లో బిట్​కాయిన్ కూడా ఒకటి.  దీని విలువ రోజురోజుకు కొత్త రికార్డు స్థాయిను తాకుతోంది.  2007లో ప్రారంభమైన బిట్‌కాయిన్ ప్రస్థానం అనేక హెచ్చుతగ్గులకు లోనై అంతిమంగా దీని విలువ పెంచుకుంటూ వస్తోంది. 

ఆశ్చర్యకరంగా  2020లో దీని విలువ 170% మేర పెరిగింది. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ 2021 ఏప్రిలో 56,267 డాలర్ల వద్ద ఉంది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 43 లక్షల రూపాయలు,

ఈ క్రిప్టోకరెన్సీకి ఎందుకు ఇంత డిమాండ్​? బిట్​కాయిన్​లో పెట్టుబడి సురక్షితమేనా? బిట్​కాయిన్ వ్యవస్థ ఎలా పని చేస్తుంది? దీనిని ఎవరైనా నియంత్రిచగలరా? అనే విషయాలను తెలుసుకుందాం.

బిట్‌కాయిన్‌ అనేది ఒక వర్చువల్‌ కరెన్సీ. దీనిపై ఏ ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ఈ కరెన్సీని ఏ బ్యాంకు జారీ చేయదు. ఇది ఏ దేశానికి చెందిన కరెన్సీ కాదు కాబట్టి దీనిపై ట్యాక్స్‌ అనేది ఉండదు. 

క్రిఫ్టో కరెన్సీ అనేది కాగితాలు లేదా నాణేల భౌతికరూపంలో వుండదు 
ఇది పూర్తిగా డిజిటల్ కరెన్సీ మాత్రమే.

బిట్‌కాయిన్‌ అనేది కంప్యూటర్‌లో దాచుకునే ఒక ఫైల్‌ లాంటిది. స్మార్ట్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌లలో డిజిటల్‌ వాలెట్‌ రూపంలో దాచుకోవచ్చు. 

గత ఏడాది డిసెంబర్​లోనే తొలిసారి 20 వేల డాలర్ల మార్క్​ దాటిన బిట్​కాయిన్, రెండు నెలల్లోనే 45 వేల డాలర్లపైకి చేరడం విశేషం.

నిజానికి చాలామందిలో  క్రిప్టోకరెన్సీపై అనేక అనుమానాలు వున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్​ (వర్చువల్) కరెన్సీ.  సాధారణ కరెన్సీలు (రూపాయి, డాలర్​ వంటివి) భౌతికంగా చలామణి అవుతుంటాయి. క్రిప్టో కరెన్సీలు మాత్రం భౌతికంగా కనిపించవు, వాటిని ముట్టుకోలేం. ఇవి ప్రత్యేక సాఫ్ట్​వేర్​ కోడ్​ల ద్వారా పని చేస్తుంటాయి. ఇవి పూర్తిగా డిజిటల్​ రూపంలో మాత్రమే ఉంటాయి. 

బిట్​కాయిన్​ జపాన్​కు చెందిన 'షాతోషీ నాకామోటో' అనే టెకీ రూపొందించినట్లు ప్రచారంలో ఉంది. అయితే దీనిపై స్పష్టత లేదు. 2009లో బిట్​కాయిన్​ మనుగడలోకి వచ్చింది.

బ్లాక్​ చైన్​ సాంకేతికత అనేది క్రిప్టోకరెన్సీకి మూలాధారాం. ప్రస్తుతం బిట్​కాయిన్​, ఇథీరియం, స్టెల్లార్, రిపుల్, డాష్​​ ఇలా చాలా ఇతర క్రిప్టోకరెన్సీలు మనుగడలో వున్నాగానీ.. వీటన్నింటిలో బిట్​కాయిన్​ అత్యంత ఆధరణ పొందిన క్రిప్టో కరెన్సీ.

క్రిప్టోకరెన్సీ ప్రస్తావన వచ్చినప్పుడు, లేదా బిట్కాయిన్ గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా మనం చాలా సార్లు క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్, బ్లాక్​ చైన్ సాంకేతికత గురించి వింటూనే ఉంటాము. బ్లాక్​చైన్​ అనేది డేటా బైస్​ ఆధారంగా పని చేసే ఓ ప్రత్యేక సాంకేతికత. ఇందులో సమాచారం అనేది బ్లాకులుగా విభజన చెందివుంటుంది. ఆ సమాచారం మొత్తం ప్రపంచవ్యాప్తంగా వేరువేరు సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. ఇలా ఒక సర్వర్​కు మరో సర్వర్​ అనుసంధానమై ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ చైన్ రూపంలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని హ్యాక్ చెయ్యడం లేదా తస్కరించడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే క్రిప్టోకరెన్సీలను ఎవరూ నియంత్రించడం జరగదు. అందుకే క్రిఫ్టో కరెన్సీ అనేది అత్యంత సురక్షితమనే వాదన కూడా ఉంది.

బిట్​కాయిన్ విలువ ఎందుకు అంతగా పెరుగుతోంది?గత పదేళ్ల వ్యవధిలో బిట్​కాయిన్ బెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్​గా నిలిచింది. ఇన్వెస్టర్లు దీన్ని ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం లావాదేవీలు ప్రారంభిస్తున్నారు.

చాలా కార్పొరేట్ సంస్థలు, సంస్థాగత పెట్టుబడిదారులు క్రిప్టోకరెన్సీలపై దృష్టిసారిస్తున్నారు. ఇన్వెస్ట్​మెంట్ పోర్ట్​ఫోలియోను వైవిధ్యంగా మార్చుకోవడం కోసం బిట్​కాయిన్లపై అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. బిట్​కాయిన్ మార్కెట్ ఇతర మార్కెట్లతో పోలిస్తే చాలా చిన్నది కాబట్టి బిట్​కాయిన్ విలువ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. 

బిట్​కాయిన్​ పొందడం ఎలాగో తెలుసుకుందాం.

బిట్‌కాయిన్లను సృష్టించే ప్రక్రియను మైనింగ్‌ అంటారు. బిట్‌కాయిన్‌ మైనింగ్‌లో భాగంగా శక్తివంతమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి క్లిష్టమైన అల్లారిథమ్‌లను పరిష్కరించి లావాదేవీలను వెరిఫై చేస్తారు. మైనింగ్‌ చేసేవాళ్లు విజయవంతంగా ఈ ప్రక్రియలో గెలుపొందితే వారికి కొన్ని బిట్‌కాయిన్లను అందజేస్తారు.

ఎంతో క్లిష్టమైన క్రిప్టోగ్రఫీ సమస్యలను పరిష్కరించడం ద్వారా కొత్త బిట్​కాయిన్​లను రివార్డుగా పొందొచ్చు.  

బంగారం, వజ్రాల మారిదిగానే బిట్‌కాయిన్లు కూడా చలా పరిమితంగా లభ్యమవుతాయి. మరోవైపు ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అందువల్ల సరఫరా, డిమాండ్‌ సూత్రం ప్రకారం దీనికి గిరాకీ పెరుగుతోంది.

రూపాయికి 100 పైసలు ఎలానో.. ఒక బిట్​కాయిన్​కు 100 షాతోషీలు ఉంటాయి. ప్రస్తుతం బిట్​కాయిన్​ల విలువ భారీగా పెరిగిన కారణంగా ఒక బిట్​కాయిన్ కొనడం చాలా కష్టం. అలాంటి వారు షాతోషీలనూ లేదా, అందులో కొంత భాగాన్ని కొనుగోలు చేయడం ద్వారా కూడా పెట్టుబడి పెట్టొచ్చు.

ప్రభుత్వాల నియంత్రణ ఉండదు కాబట్టి కొంత మంది బిట్‌కాయిన్లను ఇష్టపడుతుంటారు. అన్ని లావాదేవీలు నమోదు అవుతాయి కాబట్టి వాటిని ఎవరు చేశారో బయటకు తెలియదు. తమ లావాదేవీల వివరాలు బయటకు తెలియకూడదు అనుకునేవారు బిట్‌కాయిన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

 క్రిప్టోకరెన్సీలపై ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలాంటి నిబంధనలు, మార్గదర్శకాలు లేవు కాబట్టి ఏదైనా వివాదాలు తలెత్తితే.. ప్రభుత్వం నుంచి సహాయం లభించదు. కాబట్టి ఎలాంటి చట్టాలు అతిక్రమించకుండా  ట్రేడింగ్ చెయ్యడం ముఖ్యం.

భారత్​లో బిట్​కాయిన్ కొనుగోలు కొనుగోలు/అమ్మకానికి  పలు ఎక్స్ఛేంజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో వాజిర్ ఎక్స్, కాయిన్​స్విచ్, జెబ్​పే, కాయిన్​డీసీఎక్స్​ ముఖ్యమైనవి. 

ఈ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ అక్కౌంట్ పొందిన తర్వాత  క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడులు పెట్టొచ్చు.కానీ భారత్​లోని క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు ఏ ప్రభుత్వ నియంత్రణ ఫ్రేమ్​వర్క్ కిందకు రావు. భారత్​లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీటికి లైసెన్సులు సైతం అవసరం లేదు. ప్రస్తుతం ఇవన్నీ స్వీయ-నియంత్రణ సంస్థ ఫ్రేమ్​వర్క్​ అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

బిట్​కాయిన్ ట్రేడింగ్ అకౌంట్ తెరిచేందుకు  క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలన్నీ దాదాపుగా ఒకే తరహా సమాచారాన్ని సేకరిస్తాయి. బ్యాంక్ ఖాతా, కేవైసీ వివరాలతో పాటు మొబైల్ నెంబర్​తో బిట్​కాయిన్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్ లేదా పాన్​ కార్డులలో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతా నుంచి నగదును ట్రేడింగ్ అకౌంట్​కు బదిలీ చేసుకోవచ్చు. 

భారత్​లో తమ బిట్​కాయిన్ పెట్టుబడి లాభాలపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ బిట్​కాయిన్ అమ్మకం, కొనుగోళ్లే ప్రధాన కార్యకలాపాలై ఉంటే, వ్యాపారాలపై విధించే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


31, ఆగస్టు 2021, మంగళవారం

డయాబెటిక్ రోగులకు ఉపయోగపడే పెరటి మొక్కలు Backyard plants that useful for diabetic patients.

 డయాబెటిక్ రోగులకు ఉపయోగపడే పెరటి మొక్కలు. 

శరీరంలో ఇన్సూలిన్ తక్కువగా విడుదలైనప్పుడు మధుమేహం సమస్య వస్తుంది. మారుతున్న జీవనశైలితో ఊబకాయం, ఒత్తిడి వంటి సమస్యలతో  డయాబెటిక్ ప్రమాదం తొందరగా వచ్చే అవకాశం వుంటుంది.

ప్రపంచంలో దాదాపు 45 కోట్ల మంది డయాబెటిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.  ఒక్కసారి డయాబెటిక్ బారీన పడితే నియంత్రణ చాలా కష్టమవుతోంది. నిత్యం మందులతో సహజీవనం చేయాల్సి వస్తోంది.

అయితే కేవలం కెమికల్ ట్యాబ్లెట్స్ మాత్రమే కాకుండా.. ఆయుర్వేద పద్దతులను అనుసరించడం ద్వారా కూడా డయాబెటిక్ సమస్యను నియంత్రించవచ్చు. ముఖ్యంగా మన ఇంట్లోనే కనిపించే కొన్ని మొక్కల ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. 

వాటి గురించి తెలుసుకుందాం.

కలబంద మొక్క.

aloe vera plant for diabetic patients


కలబంద చాలా సమస్యలకు నివారిణి గా ఉపయోగపడ్తుంది. దీని లోపలి గుజ్జును శుభ్రం చేసుకుని కొద్దికొద్దిగా అలాగే తీసుకోవచ్చు. ఇది డయాబెటిక్ రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్‏ను కంట్రోల్ చేయడానికి సహాయపడే కొన్ని పదార్థాలు ఇందులో ఉన్నాయి. రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని నియంత్రించడానికి కలబంద గొప్పగా పనిచేస్తుంది.

ఇన్సులిన్ ప్లాంట్.

Insulin Plant for Dibetic people


కాస్టస్ ఇగ్నెయస్ లేదా స్పైరల్ ఫ్లాగ్ అని పిలిచే ఈ ఇన్సులిన్ మొక్కకు ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు పుల్లగా ఉంటాయి. ఈ ఆకులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు.

స్టెవియా ప్లాంట్.

stevia plant for diabetic patients


స్టెవియా మొక్క డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగపడుతుంది.. దీని ఆకులు తియ్యగా ఉంటాయి.ఈ ఆకులను పొడి చేసి టీ, లేదా షర్భత్‏లలో చక్కెరగా ఉపయోగించవచ్చు. దీని ఆకులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఉపయోగపడతాయి. ఇందులో జీరో కేలరీలు ఉంటాయి. అలాగే సుగర్ వ్యాధిగ్రస్థుల శరీరంలోని కేలరీలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

 వేప ఆకులు.

neem leaves help diabetic patients


డయాబెటిస్ ను నియంత్రించడంలో వేప అనేది దివ్యఔషదం. ఆయుర్వేదంలో వేప ఆకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. వేప ఆకులలో గ్లైకోసైడ్స్, ఇంకా అనేక యాంటీ-వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.


30, ఆగస్టు 2021, సోమవారం

ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన వెబ్‌సైట్‌లు Best websites for Engineering Students

WEBSITES FOR ENGINEERING STUDENTS


ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యంత ఉపయోగకరమైన వెబ్‌సైట్‌లు Best websites for Engineering Students

1. ఇంజినీరింగ్.కామ్  Engineering.com

 ఇది ఇంజనీరింగ్ మరియు దాని అప్లికేషన్, కాన్సెప్ట్‌ల వివరణ, సూత్రాలు, సాఫ్ట్‌వేర్ ట్యుటోరియల్స్, మరియు వీడియో ట్యుటోరియల్స్ అందిస్తుంది. అంతేకాకుండా, వివిధ విభాగాలు మరియు సంబంధిత ఇంజనీరింగ్ ఉద్యోగాల జాబితాను తెలియజేస్తుంది.  ఇంటర్వ్యూలను క్రాక్ చేయడానికి చిట్కాలు కూడా ఈ సైట్‌లో విధ్యార్థులకు లభిస్థాయి. ఇంకా ఎలక్ట్రానిక్స్, 3 డి ప్రింటింగ్, సాఫ్ట్‌వేర్ డిజైనింగ్, గేమ్‌లు, పజిల్స్ లైబ్రరీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2.  స్టాన్‌ఫోర్డ్ ఇంజనీరింగ్ ఎవ్విరీవేర్  Stanford Engineering Everywhere

స్టాన్‌ఫోర్డ్ ఇంజనీరింగ్ ఎవిరీవేర్ అనేది యుఎస్ అంతటా విద్యార్థులకు కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాధమిక విధ్య ను నేర్చుకోవడానికి, స్టాన్‌ఫోర్డ్ అండర్ గ్రాడ్యుయేట్లు అధ్యయనం చేసే  కోర్సుల వివరాలను  అందించడానికి రూపొందించబడిన ఉచిత వెబ్ సైట్. ఈ వెబ్ సైట్ లోని మెటీరియల్స్ విథ్యార్థులకే కాకుండా విద్యావేత్తలకు కూడా అందుబాటులో ఉన్నాయి.  కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఎవరికైనా ఉచితంగా అందుబాటులో ఉండేలా క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద అందుబాటులో ఉంచబడ్డాయి.

3. ఇంటరెస్టింగ్ ఇంజనీరింగ్ Interesting Engineering

 ఒక సీనియర్ ప్రొఫెసర్ ద్వారా నడపబడే వెబ్‌సైట్ లో  ఇంజనీరింగ్‌కు సంబంధించిన  సమస్యలను మరియు సందేహాలను పంపగల విభాగాన్ని కలిగి ఉంది.  ఇంజనీరింగ్ పరిశోధన మరియు ఆసక్తికరమైన ఇంజనీరింగ్ విషయాలపై ఇతర ట్యుటోరియల్స్ కోసంలను ఈ సైట్ ను  చూడవచ్చు.

4. ఆర్డునో Arduino

 ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు తప్పకుండా తెలుసుకోవాల్సిన వెబ్ సైట్ ఆర్డునో. ఆర్దునొ అనేది  ఉపయోగించడానికి చాలా సులభమైన, సౌకర్యవంతమైన వెబ్ సైట్. ఇందులో కొనుక్కోవడం కోసం వీలుగా ఉండే మెటీరియల్స్ అలాగే ఉచిత ఆన్‌లైన్ వీడియో ట్యుటోరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.   ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ ఫ్రెషర్స్ కి ఇది ఉత్తమమైన వెబ్ సైట్.

5.  యం ఐ టి ఓపెన్ కోర్స్ వేర్ MIT Open Course Ware

మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దాని దాదాపు అన్ని కోర్సులకు సంబంధించి పాఠాలకు ఈ వెబ్ సైట్ ఆన్‌లైన్ యాక్సెస్‌ను అందిస్తుంది,  విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అపరిమిత డౌన్లోడింగ్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో  మెకానికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్ మరియు లిబరల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఈ సైట్ అందించే సమాచారం విస్తృతంగా   విద్యార్థులకు సహాయపడుతుంది. ఈ వెబ్ సైట్ ప్రధానంగా సైన్స్, టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ కోర్సులకు సంబందించినదే కానీ, ఇందులోని ఆన్‌లైన్ కోర్సు మెటీరియల్స్ కంప్యూటర్ సైంటిస్టులు మరియు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కూడా ఎంతో ఉపయుక్తమైనవి. 

6.W3 skools

ప్రోగ్రామింగ్ మరియు కోడింగ్ లాంగ్వేజ్‌ల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం అత్యుత్తమమైన వెబ్ సైట్ w3 school. AJAX, SQL, ASP, CSS, జావాస్క్రిప్ట్ మరియు HTML మార్కప్ కోడ్‌పై సులభంగా అర్థం చేసుకునే పద్దతిలో లోతైన ట్యుటోరియల్‌లను అందిస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్ధులు తమ తమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మరియు వారు ఎంచుకున్న వృత్తిలో విజయం సాధించడానికి అవసరమైన సమాచారాన్ని సంపూర్ణం గా. డబ్ల్యూ 3 స్కూల్స్ వెబ్‌సైట్ సహజమైన మార్గ నిర్ధేశం చేస్తుంంది,   కొత్తవారు తమ డిజైన్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి, మరియు వారి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక కంప్యూటింగ్ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సమాచారాన్ని పూర్తిగా అందజేస్తుంది.

7. కోడ్‌కాడమీ Codecademy

కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్‌లో అత్యంత వినూత్నమైన విద్యా సైట్‌లలో ఒకటైన కోడ్‌కాడమీ ప్రొఫెషనల్ స్థాయిలో కోడ్ నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులకు రెండు రెండు విధాలుగా సప్పోర్ట్ను అందిస్తుంది.  ప్రాథమిక కోర్సు  వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా లభిస్తుంది.  ప్రొఫెషనల్ అకడమిక్ అడ్వైజర్ల సహాయం కోరుకునే విద్యార్థులు నెలవారీ రుసుముతో కోడ్‌కాడమీ ప్రో కి అప్‌గ్రేడ్ చేయవచ్చు. విద్యార్థులు తక్కువ ఖర్చుతోనే ఉపయోగకరమైన నాణ్యమైన విధ్యను పొందవచ్చు. 

8. ఇంజనీర్ గర్ల్ Engineer Girl

ప్రత్యేకంగా  ఐటి రంగం పట్ల ఆసక్తి ఉన్న మహిళల కోసం తయరుచేయబడిన వెబ్ సైట్ ఇది.  ఇది మహిళా ఇంజనీర్‌కి కెరీర్ గైడ్‌గా ఉన్న సైట్.  ఇది టెక్నాలజీ పోటీలు మరియు ఇతర ఇంజనీరింగ్ వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందిస్తుంది. ఇందులో "ఉమెన్ ఇంజనీర్స్" విభాగం మరియు "కెరీర్" విభాగం వుంటుంది. మహిళలకు ఇంజనీరింగ్ మరియు ఉద్యోగావకాశాల  గురించి సమాచారాన్ని అందిస్తుంది.

9. ఈ ఫండా  Efunda

ఈ ఫండా  ఇంజనీర్ల కోసం అన్ని సూత్రాలు మరియు ముఖ్యమైన విషయజ్ఞానాన్ని  కలిగి ఉంది. ఇందులోని డైరెక్టరీ విభాగం వివిధ అంశాలపై ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తుంది. మ్యాగజైన్ విభాగంలో  వివిధ మ్యాగజైన్‌ల నిల్వ వుంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు భౌతిక శాస్త్రం, గణితం మరియు రసాయన శాస్త్రాల గురించి ఈ సైట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది,   డైలీ ఫార్ములాలు, యూనిట్ కన్వర్షన్ లెక్కలు మొదలైనవి ఒకే చోట జాబితా చేయబడి ఉంటాయి. ఇందులో ఉన్న మరొక గొప్ప విశేషం కాలిక్యులేటర్ విభాగం, ఇది ఇంజనీరింగ్ విధ్యార్థులు లెక్కించడానికి ఆన్‌లైన్ లో వున్న  గొప్ప సాధనం.


అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌ "జియోఫోన్‌ నెక్ట్స్‌"..!! Jio phone next

  

jiophone next, jio smart phone, smart phone jio, lowest price smart phone


అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌  త్వరలో జియోఫోన్‌ నెక్ట్స్‌..!!

రిలయన్స్‌ జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీయనుంది. 

ప్రపంచంలో అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ jio phone nextను సెప్టెంబర్‌ 10న ముఖేష్ అంబానీ మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌ కొనుగోలు చేసేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  కొనుగోలుదారుల ఆసక్తిని గమనించిన కంపెనీ  ఈ ఫోన్‌కి ప్రీ బుకింగ్స్‌ పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్‌ ప్రారంభం కానున్నట్లు జియో వర్గాలు చెబుతున్నాయి. 

ఫోన్‌ ధర ఎంతంటే..

గత జూన్ నెలలో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్  ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈఫోన్‌ ఫీచర్లు, ధర ఎంత ఉంటుందనే దానిపై అధికారకమైన సమాచారం లేనప్పటికీ ఈ ఫోన్ రూ.3,500 వుండొచ్చని తెలుస్తోంది.

ఈ ఫోన్‌ ఫీచర్స్‌..

జియో ఫోన్ నెక్స్ట్  5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్, 2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11  13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

టెలికాం రంగంలో మొదటి స్థానంలో ఉన్న జియో తన యొక్క యూజర్లను పెంచేందుకుగాను   రూరల్‌ ఇండియాని టార్గెట్‌ చేస్తూ గూగుల్‌తో కలిసి తక్కువ ధరలోనే ఈ జియోఫోన్ నెక్ట్స్ ను మార్కెట్‌ లో విడుదల చేయనుంది.

గుర‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే ., snoring problem

  



గుర‌క  స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే SNORING


నిద్రపోయే సమయలో గురక పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. గురక వలన పక్కన ఉన్న మిగతావారుకూడా చాలా ఇబ్బందులకు గురౌతుంటారు.

గురక చాలా అసౌకర్యమైన నిద్రను కలగజేస్తుంది. కొన్ని పరిశోధనలలో గురక వలన గుండె సంబంధ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం వుందని తెలిసింది.

 గురక రావడానికి ప్రధాన కారణాలు, ఇంకా  గురక నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే ఏమేమి  చిట్కాలు వున్నాయో తెలుసుకుందాం 

గుర‌క ఎందుకు వ‌స్తుంది?

నిద్రపోయే  సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు వున్నత్లైతే అప్పుడు గురక వస్తుంది. 

అలాగే ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ మార్గంలో కూడా అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో అది గురకకు దారితీస్తుంది. 

వాస్తవానికి గురక రావడానికి మరెన్నో కారణాలు వున్నాయి. మానసికపరమైన ఒత్తిడి, టెన్షన్ కూడా గురకకు కారణం అవుతాయి.

సాధారణంగా ముక్కుల ద్వారా గాలి తీసుకుంటాం. కానీ, నాసికా మార్గాల్లో అడ్డంకుల వల్ల కొందరు నోటితో శ్వాస తీసుకుంటుంటారు. అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులోపలి భాగం వాచివుండటం, అడినాయిడ్స్ అన్నీ కూడా శ్వాస మార్గానికి అడ్డంకుని కలిగిస్తాయి.

అలాగే వయసు పెరుగుతున్నకొద్దీ  గొంతు భాగం సన్నబడుతుంది. దీనివల్ల గురక రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే పురుషులలో మద్యం, పొగతాగడం లాంటి అలవాట్లు వుండటం వల్ల, లేదా కొంతమందిలో  లోరజ్ పామ్, డైజిపామ్ లాంటి ట్రాంక్విలైజర్ ఔషధాలను వాడటం వల్ల వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉంటాయి. 

అధిక బరువు ఉండడం వల్ల, లేదా మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడినా గురకకు దారితీస్తుంది. 

సైనస్ సమస్యలో ముక్కు నాసికా రంధ్రాలు జామ్ అవుతాయి. దీంతో గాలి కష్టంగా వెళ్లాల్సి వచ్చి శబ్దం బయటకు వస్తుంది.  ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువమంది పని వత్తిడి వల్ల నిద్ర పోయేటపుడు  గురక సమస్యతో బాధపడుతుంటారు. 

ఇక గుర‌క స‌మ‌స్య‌ను ఎలా అధికమించ‌వచ్చో  తెలుసుకుందాము.

 రాత్రి నిద్రపోయే ముందు అర టీ స్పోన్‌ తేనె, అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి  తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

 ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీని వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.

 ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్ర‌పోతే మంచి ఫలితం కనిపించవచ్చు.

అలాగే రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. ఇదికూడా గురక సమస్యను అధుపులో వుంచుతుంది.

దీనితో పాటుగా వీలున్నపుడు భ్రీతింగ్ ఎక్సర్ సైజెస్, మధ్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా వుండటం లాంటివి చాలా ఉపయోగపడుతాయి.

29, ఆగస్టు 2021, ఆదివారం

మార్కెట్లో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.

 

Simple Electric Scooter, electric schooter


ప్రస్తుతం విద్యుత్‌ ఆధారంగా నడిచే వాహనాల హవా నడుస్తోంది. 

ఈ క్రమంలోనే చాలా కంపెనీలు సైతం అధునాతన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లను తయారు చేస్తున్నాయి. 

ఈ జాబితాలోకి కొత్తగా చేరింది  "సింపుల్‌ ఎనర్జీ".

ప్రస్తుతం మార్కెట్లో ప్రజలు కూడా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వినియోగంపై ఆసక్తి చూపిస్తుండడంతో  రోజుకో కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేస్తున్నాయి. 

తాజాగా మార్కెట్లోకి సింపుల్‌ ఎనర్జీ అనే స్టార్టప్‌ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. 

ఈ స్కూటర్‌లో 4.8 కిలోవాట్స్ గల పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని ఇచ్చారు. డిటాచబుల్‌, పోర్టబుల్‌ ఫీచర్‌తో సులభంగా బ్యాటరీ చార్జ్‌ చేసుకోవచ్చు. 

నిమిషం చార్జింగ్ చేస్తే 2.5 కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది.  పూర్తిగా చార్గింగ్  చేస్తే ఏకంగా 203 కిలో మీటర్లు వెళ్లొచ్చు. 

గంటకు 105 కి.మీల వేగంతో దూసుకుపోగలిగే ఈ స్కూటర్‌లో 7 అంగుళాల కస్టమైజబుల్ డిజిటల్ డ్యాష్ బోర్డ్, ఆన్ బోర్డ్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, ఎస్ఓఎస్ మెసేజ్, డాక్యుమెంట్ స్టోరేజీ, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు అందించారు. 

బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్‌  స్కూటర్‌ ధరను రూ. 1.10 లక్షలుగా నిర్ణయించింది. స్కూటర్‌ను రూ. 1947 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. 


జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు సమస్యలకు పరిష్కారం. hair oil for dandruff and hair fall.

 



 hair oil for dandruff and hair fall. 

మారుతున్న జీవనశైలి, పెరుగుతన్న వీతావరణ కాలుష్యం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, దీనికి తోడు అపసవ్యమైన ఆహారపు అలవాట్లు, జుట్టు సమస్యలకు ప్రధాన కారణమవుతాయి. దీనివల్ల  జుట్టు రాలిపోవడం, చుండ్రు, వెంట్రుకలు త్వరగా తెల్లబడడం లాంటివి జరుగుతుంటాయి.

 ఈ సమస్యలన్నిటినీ అదుపులో పెట్టడానికి, అలాగే ఆరోగ్యకరమైన జుట్టుని తిరిగి పొందడానికి ఉల్లి నూనె సహాయం చేస్తుంది.

ఉల్లిపాయ నూనె తో చాలా ఉపయోగాలున్నాయి.

ఉల్లిపాయ హెయిర్ ఆయిల్ మీ జుట్టుని ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు జుట్టు ఒత్తుగా పొడవు పెరిగేలా చేస్తోంది. 

ఉల్లిపాయ నూనె తాయరుచేసుకునే విధానం:

మెత్తగా గ్రైండ్ చేసుకున్న  ఉల్లిపాయ పేస్ట్ ని కొబ్బరి నూనెతో కలిపి బాగా రంగు మారే వరకు వేడి చేసుకోవాలి, దించుకుని, వేడి తగ్గిన తర్వాత వడగట్టుకుని జాగ్రత్త చేసుకోవాలి.

ఉల్లిపాయ నూనెను వెంట్రుకల కుదుళ్లకు పట్టేలా వృత్తాకారంగా నెత్తిమీద మర్దనా చేస్తూ అప్లై చేయాలి. ఇలా చేయడం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో జుట్టు మూలాలను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

ఉల్లిపాయలో మంచి పోషకాలున్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

ముఖ్యంగా కాలుష్యంతో బలహీనమైన జుట్టు కుదుళ్లకు మంచి బలాన్ని ఇవ్వడంలో ఉల్లిపాయ నూనె సహాయపడుతుంది

ఉల్లిపాయ హెయిర్ ఆయిల్  ఫోలికల్స్‌ను పెంచుతుంది ఇది జుట్టు ఒత్తుగా వుండేలా తోడ్పడుతుంది.

ఉల్లిపాయ రసం చుండ్రును నియంత్రించడంలో సహాయపడుతుంది. మెరిసే బలమైన జుట్టును ఇస్తుంది.

ఉల్లిపాయ హెయిర్ ఆయిల్‌  onion hair oil లోని శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్థాయి.

ఉల్లిపాయలో సహజంగా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే జుట్టు పొడవుగా, ఒత్తుగా చేస్తుంది.



 

27, ఆగస్టు 2021, శుక్రవారం

ఆపిల్ ఐ ఫోన్ 13 Apple iPhone 13

 

https://linktelugu.blogspot.com/2021/08/13-apple-iphone-13.html


ప్రతి ఆపిల్ ఐఫోన్ Apple iPhone మార్కెట్లోకి రాకముందే సంచలనం సృష్టిస్తుంది. చాలామంది ఐఫోన్ కొత్త వెర్షన్ వస్తుందని తెలిసిన వెంటనే దానిగురించి తెలుసుకోవాలని ఉత్సాహపడతారు.

 ప్రతి ఆపిల్ ఐఫోన్ మార్కెట్లోకి రాకముందే సంచలనం సృష్ఠిస్తుంటుంది.  చాలామంది ఐఫోన్ కొత్త వెర్షన్ వస్తుందని తెలిసిన వెంటనే దానిగురించి తెలుసుకోవాలని ఉత్సాహపడతారు.  ఐఫోన్ వరుసగా విడుదల చేస్తూ వస్తున్న వెర్షన్స్ అన్నీ వేటికవే ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ అప్ డేట్స్ తో వస్తుంటాయి. అందుకే ఆపిల్ ఐఫోన్ క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. 

ఆపిల్ ఐఫోన్ 12 Apple iPhone 13 విజయవంతంగా మార్కెట్లో దూసుకుపోతోంది. ఇప్పడు తాజాగా ఆపిల్ ఐఫోన్ 13  లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. ఈ అప్‌గ్రేడ్ 2021 లో ఐ ఫోన్ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోన్‌లలో ఒకటి.  లాంచ్ తేదీ, ధరల శ్రేణి అదేవిధంగా స్పెసిఫికేషన్‌లతో సహా దాని వివరాల గురించి అధికారికంగా ధృవీకరణ లేనప్పటికీ,  ఆపిల్ వచ్చే నెలలో ఐఫోన్ 13 సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

 ఐఫోన్ 13 ఫోన్‌లు  అప్‌గ్రేడ్ చేసిన ఫేస్ ఐడి హార్డ్‌వేర్‌ని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీని అర్థం ఈ I PHONE 13 మాస్క్‌తో కూడా ముఖాన్ని స్కాన్ చేయగలదు . అదేవిధంగా  పొగమంచు గ్లాసెస్ ధరించినా కూడా ముఖాన్ని స్కాన్ చేసే అద్భుత ఫీచర్ తో రాబోతోంది ఐఫోన్ 13.  

దీని CAD రెండర్లు ఐఫోన్ 12 లో ఉన్నట్లుగా కుడి వైపు కాకుండా ఎడమ వైపున ముందు కెమెరాను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇది డెవలప్‌మెంట్ టిప్‌స్టర్ జోన్ ప్రోసర్ సహకారంతో వస్తుంది.

యాపిల్ ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక అప్‌డేట్‌ను విడుదల చేసింది, దీని సహాయంతో ఐఫోన్ X,లేదా అంతకంటే పై సిరీస్ ఫోన్ లు కలిగి ఉన్న వినియోగదారులు కూడా మాస్క్‌తో  ఫేస్-అన్‌లాక్ చేయవచ్చు, కానీ, దీని కోసం వారు ఆపిల్ వాచ్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.  ఆపిల్ వాచ్ వంటి అదనపు పరికరాలు అవసరం లేకుండా ఐఫోన్ 13 లో ఈ సౌకర్యం పొందవచ్చని తెలుస్తోంది.

ఆపిల్ రాబోయే ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లతో పాటు వనిల్లా ఐఫోన్ 13 కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

రెగ్యులర్ ఐఫోన్ 13 , ఐఫోన్ 13 మినీ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరాలు ఉంటాయని, అదే  ప్రో మోడళ్లలో ట్రిపుల్ కెమెరాలుఉండొచ్చు. ముఖ్యంగా, ప్రో మోడల్స్ 120hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తాయి. ఇది ఇప్పటికే ఐప్యాడ్ ప్రో  మోడళ్లలో “ప్రోమోషన్ డిస్‌ప్లే” గా ఫీచర్ చేశారు.

షియోమీ సరికొత్త గ్యాడ్జెట్స్ XIAOMI


draft.blogger.com/blog/post/edit/4450771144974125185/2120872744303874523



 ప్రజల జీవనశైలిని మరింత స్మార్ట్ చేసే క్రమంలో, అధునాతన టెక్నాలజీతో షియోమీ సరికొత్త గ్యాడ్జెట్స్ ప్రవేశపెట్టింది.

 XIAOMI షియోమి  స్మార్ట్ లివింగ్ ఈవెంట్‌లో భాగంగా 6 ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఉత్పత్తులు ప్రజల జీవనశైలిని స్మార్ట్ చేయడానికి సహాయపడతాయని కంపెనీ చెబుతోంది. 

ఇందులో భాగంగా  Wi-Fi  కనెక్టివిటీ కోసం Mi రూటర్ 4A,  Mi 360 హోమ్ సెక్యూరిటీ కెమెరా, Mi TV 5x 3  సిరీస్, Mi స్మార్ట్ బ్యాండ్ 6 లను లాంచ్ చేసింది. వీటితోబాటుగా  షియోమి షూలను కూడా విడుదల చేసింది 

పై గాడ్జెట్స్ మొత్తం IOT టెక్నాలజి మీద ఆధారపడి పనిచేస్తాయి. 

గాడ్జట్ ని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయడం ద్వారా మన పనిని IOT సులభతరం చేస్తుంది. మరోవిధంగా చెప్పాలంటే షియోమి తయారుచేసిన అన్ని గాడ్జట్స్ ని ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయగలము., ఇవన్నీ  ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ పరిజ్ణానం ఆధారంగా ఆపరేట్ కాబడుతాయి.  

IOT అనేది నెట్‌వర్కింగ్ టెక్నాలజీపై పనిచేస్తుంది.

దీని సహాయంతో, మీరు మీ ఇంటిలోని పరికరాలను ఇంటర్నెట్ సహాయంతో కనెక్ట్ చేయవచ్చు. ఆ పరికరాలన్నీ ఎక్కడి నుండైనా పర్యవేక్షించవచ్చు.

షియోమి స్మార్ట్ ఈవెంట్‌లో లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఇలా  వున్నాయి. 

1. Mi రూటర్ 4A

 ఇది 3 గిగాబైట్ నెట్‌వర్క్ పోర్ట్‌లను కలిగి ఉంటుంది. డ్యూయల్ కోర్ CPU, 4  హై గెయిన్ యాంటెన్నా అందుబాటులో ఉంటాయి. వీటి సహాయంతో, 1167 Mbps ఇంటర్నెట్ స్పీడ్  అందుబాటులో ఉంటుంది.

2. Mi 360 హోమ్ సెక్యూరిటీ కెమెరా

ఈ కెమెరా డ్యూయల్ బ్యాండ్ వైఫై సిస్టమ్‌తో వస్తుంది. 2 రకాల వాయిస్ కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది F1.5 అపార్చర్ కలిగిఉంది. నైట్ విజన్ సెన్సార్ ఇంకా ఈ కెమెరా డ్యుయెల్ వే వాయిస్ కాలింగ్‌ సౌకర్యం ఉంది. 

3. Xiaomi రన్నింగ్ షూస్

బ్లాక్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్‌లతో  Xiaomi రన్నింగ్ షూస్ కూడా ఈ ఈవెంట్‌లో లాంచ్ అయ్యాయి. ఇందులో PU హీల్ స్టెబిలైజర్, యాంటీ-ట్విస్ట్ సపోర్ట్ లేయర్, TPU ఫ్లెక్స్ యూనిట్, క్లౌడ్ బాంబ్ పాప్‌కార్న్ మిడ్‌సోల్, అల్ట్రా స్ట్రాంగ్ రబ్బర్ గ్రిప్ ఉన్నాయి. దీని ధర రూ .2,699 గా ప్రకటించారు.

4. Mi TV 5x సిరీస్

ఈ టీవీ  43, 50, 55 అంగుళాల స్క్రీన్  సైజు వేరియంట్‌లతో లాంచ్ అయింది. టీవీ స్టాండ్ మెటల్‌తో తయారైంది. బాడీ రేషియో 96.6%. ఇందులో 100 కోట్లకు పైగా కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేసింది.

ఇందులో డాల్బీ విజన్, HDR10+, HDR 10, 40W స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. పేరంటల్ లాక్, మరియు సురక్షితమైన కంటెంట్‌ను వెతకడానికి ఆప్షన్ ఉంది.  15 భాషలు అందుబాటులో ఉంటాయి. అలాగే 30 OTT యాప్‌ల నుండి 75 కి పైగా ఉచిత లైవ్ ఛానెల్‌లు అందుబాటులో ఉంటాయి.

5. Miస్మార్ట్ బ్యాండ్ 6

80 కి పైగా పూర్తి స్క్రీన్ వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్రూఫ్, రియల్ టైమ్ హార్ట్ బీట్ మానిటర్, SpO2 స్థాయి, నోటిఫికేషన్ అలెర్ట్ లను పంపవచ్చు. ఈ స్మార్ట్ బ్యాండ్‌లో మాగ్నెటిక్ ఛార్జింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. చార్జింగ్ చేసేటపుడు  పట్టీని తొలగించాల్సిన అవసరం లేదు.Mi స్మార్ట్ బ్యాండ్‌లో 1.56-అంగుళాల AMOLED  టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. 30 ఫిట్‌నెస్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

6.మీ నోట్‌బుక్ అల్ట్రా షియోమి

షియోమీ ఇండియాలో రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్‌లు Mi నోట్‌బుక్ ప్రో,  Mi నోట్‌బుక్ అల్ట్రా.  ఈ సెకండ్ జనరేషన్ ల్యాప్‌టాప్ల ను గత సంవత్సరంMi నోట్‌బుక్ 14 కి అప్‌గ్రేడ్‌గా లాంచ్ చేశారు. ఈ కొత్త మోడల్స్ 3.2క్ డిస్‌ప్లే, 11 వ జెనరేషన్ ఇంటెల్ టైగర్ లేక్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటాయి.

Mi నోట్‌బుక్ ప్రో ధర 8GB RAM మరియు కోర్ i5  ప్రాసెసర్ వేరియంట్‌కు రూ .56,999,  16GB RAM, కోర్ i5 ప్రాసెసర్‌కు రూ .59,999, అదేవిధంగా  16MB RAM , కోర్ i7 ప్రాసెసర్ వేరియంట్‌కు రూ .72,999 గా నిర్ణయించారు.


26, ఆగస్టు 2021, గురువారం

UFO ఎగిరేపళ్ళాలు నిజంగా ఉన్నాయా?

blog/post/edit/4450771144974125185/2155933885186635480


UFO అంటే ఏమిటి? నిజంగానే గ్రహాంతరవాసులు వున్నారా?  భూమి మీద ఒక్కటే కాకుండా విశ్వంలోని వేరే ఇతర గ్రహాలలో  మనలాంటి లేదా మనకన్నా తెలివైన జీవులు వున్నారా? వారు ఫ్లైయింగ్ సాసర్ లాంటి తమ వాహనాల ద్వారా అప్పుడప్పుడూ భూమి మీదకు వస్తుంటారా..? వారివలన భూగ్రహానికి ఎదైనా ప్రమాదం ఉందా..?

వీటి గురించిన చర్చ ఈనాటిది కాదు. చాలా దశాబ్దాలుగా వీటికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కథలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలపై పరిశోధనలూ కూడా  కొనసాగుతోనే ఉన్నాయి.

ఇలాంటి అనేక అనుమానాలకు కారణమైంది UFO. దీనినే 'Unidentified flying object'అని అంటారు. ఎగిరే పళ్ళాలని, ఫ్లయింగ్ సాసర్లు అని కూడా పిలుస్తుంటారు.

రాకెట్ సైన్స్ అభివృద్ధి చెందిన తరువాత UFO లు ముఖ్యమైన చర్చనీయ అంశంగా మారాయి. కొంతమంది పరిశోధకులు వీటిని భూమిని సందర్శించే తెలివైన గ్రహాంతరవాసులు అని భావించారు.

1947 లో మొట్టమొదటిసారిగా UFO గురించి ప్రస్తావన వచ్చింది. వ్యాపారవేత్త కెన్నెత్ ఆర్నాల్డ్ విమానంలో వెళ్తున్నపుడు వాషింగ్టన్ లోని మౌంట్ రైనర్ సమీపంలో తొమ్మిది హై-స్పీడ్ వస్తువుల గుంపుని చూసినట్లు పేర్కొన్నాడు. అవి నెలవంక ఆకారంలో వున్నాయని, చాలా వేగంగా  అవి "నీటి మీద స్కిప్పింగ్ చేసే సాసర్ల" లాగా కదులుతున్నాయని చెప్పాడు. 

ఆ వార్తను ప్రచురించిన ఓ పత్రిక వస్తువులు సాసర్ ఆకారంలో ఉన్నాయని పొరపాటున ప్రంట్ చేసింది. అపాటినుంచి  ఫ్లయింగ్ సాసర్ అనే పదం స్థిరపడిపోయింది.

ప్రపంచంలో అనేకచోట్ల చాలామంది తాము వాటిని చూసినట్లుగా చెప్పిన ఉదంతాలున్నాయి.

మరియు 1948 లో US వైమానిక దళం ప్రాజెక్ట్ సైన్ అనే పేరుతో దర్యాప్తును ప్రారంభించింది. 

 UFO లు అధునాతన సోవియట్ విమానాలు అని ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నవారి మొదటి  అభిప్రాయం, అయితే ఇతర దేశాల పరిశోధకులు మాత్రం ఆ ఎగిరే వస్తువులు ఇతర గ్రహాల అంతరిక్ష నౌకలు కావచ్చు అని అభిప్రాయపడ్డారు.  

ప్రాజెక్ట్ బ్లూ బుక్‌పై అధికారిక విచారణల ద్వారా సుదీర్ఘకాలం కొనసాగింది. 1952 నుండి 1969 వరకు ప్రాజెక్ట్ బ్లూ బుక్ 12,000 కంటే ఎక్కువమంది సాక్ష్యాలు లేదా సంఘటనల నివేదికలను సంకలనం చేసింది 

 వారి నివేదిక ప్రకారం  UFO అనేది  సాక్ష్యాలలో 90 శాతం మంది చూసినవి ప్రకాశవంతమైన గ్రహాలు మరియు నక్షత్రాలు, ఉల్కలు, అరోరాస్, అయాన్ మేఘాలులేదా విమానం, బెలూన్లు, పక్షులు మరియు సెర్చ్ లైట్లు వంటి భూసంబంధమైన వస్తువులకు కావొచ్చని అలాగే వీటివల్ల  భద్రతాపరమైన ముప్పు లేదు అని.  

ఈ నివేదిక సుదీర్ఘ కాలం రహస్యంగా ఉంచడం వల్ల ప్రజలలో అనేక అనుమానాలను కలుగజేసింది.

 1966 లో 37 మంది శాస్త్రవేత్తలతో రెండవ కమిటీ ఏర్పాటు చేయబడింది. రెండు సంవత్సరాల తరువాత,  UFO కనిపించడం గురించి వివరణాత్మక అధ్యయనం చేసిన ఈ కమిటీ, దాని ఫలితాలను సైంటిఫిక్ స్టడీ ఆఫ్ అన్‌డెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్‌గా విడుదల చేసింది. 

ఒక్క అమెరికానే కాదు, రష్య, స్వీడన్, బ్రొటన్, టర్కీ లాంటి దేశాలు కూడా పరిశోధన చేసాయి.

ఆశ్చర్యకరంగా గత సంవత్సరం ఏప్రిల్ లో తొలిసారిగా అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ ఊFఓ లకు సంబందించి 3 వీడియోలను విడుదల చేసింది. ఎస్ -18 ఫైటర్ జెట్‌లో ఏర్పాటు చేసిన ఇన్‌ఫ్రా-రెడ్ కెమెరా సహాయంతో వీటిని యుఎస్ నేవీ రికార్డ్ చేసింది. కాని వీటిని అధీకౄత సాక్ష్యాలుగా అమెరిక పరిగణించలేదు.

చాలామంది  UFO ఉదంతాల గురించి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూనే వున్నారు. గ్రహాంతరవాసులు నింజగా ఉన్నారని, అమెరిక శాస్థ్రవేత్తలు వారితో సంబంధాలు నెరుపుతున్నారని, కొందరైతే అమెరికలోని ఏరియా 51 లో గ్రహాంతరవాసులు బంధీలుగా ఉన్నారని నమ్ముతుంటారు.

కాని ఇంతవరకు జరిగిన పరిశోధనల్లో ఎక్కడకూడా గ్రహాంతరవాసులు వున్నారనిగానీ, ఎగిరేపళ్ళాల ఉనికి గాని, శాశ్త్రీయంగా నిర్ధారించబడలేదు.  




24, ఆగస్టు 2021, మంగళవారం

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ vs హోండా యాక్టివా 6g

/4450771144974125185/2805210327061140163



ఇప్పుడు స్కూటర్ల విభాగంలో బ్యాటరీతో నడిచే వాహనాలను పోటాపోటీగా విడుదల చేస్తున్నారు. ఇటీవల ఓలా అధునాతన ఫీచర్లతో విడుదలైంది. దీనికి పోటీగా అన్నట్టు ప్రముఖ వాహన నిర్మాణ సంస్థ హోండా 'యాక్టివా 6 జి'  పరుతో ఓ ఎలక్ట్రిక్  బైక్ ను మార్కెట్లోకి విడుదల చేయబోతొంది.

దీనితో ఎలక్ట్రిక్ వాహనాల హడావుడి గట్టిగానే మొదలైనట్టు కనిపిస్తోంది. 

ఈ రెండిటినీ పోల్చి చూస్తే ఎలా ఉంటుందో గమనిస్తే.. 

 ఇటీవల ఓలా అద్భుతమైన ఫీచర్లతో విడుదలై,  బుకింగ్ సమయంలో రికార్డులు సృష్టించింది. 

కానీ, స్కూటర్ విడుదల అయ్యాక దాని ధరతో వినియోగదారులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు రిపోర్టులు చెబుతున్నాయి. 

ఇదిలా ఉంటె, దేశంలోఅత్యంత ప్రజాదరణ పొందిన హోండా యాక్టివా 6 జి,  ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కి ప్రధాన పోటీధారుగా మారుతుందని భావిస్తున్నారు. 

రెండింటిని పోల్చి చూసినపుడు  

ఓలా ఎలక్ట్రిక్ సొగసైన,క్లాసిక్ డిజైన్ ఫిలాసఫీని ఉపయోగించింది. ఇది ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌ లతో కూడిన సాధారణ ఆప్రాన్‌తో పాటు ముందు ఒక చిన్న LED  హెడ్‌ల్యాంప్‌ను అమర్చింది. ముందు భాగంలో సింగిల్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక వైపున సింగిల్ సైడెడ్ స్వింగార్మ్ వుంది. వెనుక భాగం అన్ని వైపులా టర్న్ సిగ్నల్స్ తో, ళేడ్ టెయిల్‌ లైట్‌లను కలిగి ఉంది.

ఇక హోండా యాక్టివా డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. ఇది బాణం ఆకారంలో ఉన్న  హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది, టర్న్ ఇండికేటర్లు,  ఫ్రంట్ ఆప్రాన్ ఫాక్స్ ఎయిర్ వెంట్స్,  క్రోమ్ ఇన్సర్ట్‌లను పొందుపరచబడి వుంది.  వెనుక భాగంలో ఒక టర్ప్ ఇండికేటర్‌ల చుట్టూ ఉన్న ఒక  LED టైల్‌లైట్ జోడించింది. యాక్టివా 6 జిలో డ్యూయల్ టెలిస్కోపిక్ ఫోర్కులు,సింగిల్ సైడెడ్ స్వింగార్మ్ వున్నాయి.

 ఓలా ఇ-స్కూటర్ ఆకారంలో హోండా కంటే కొంచెం పెద్దది. ఒలా పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంది. తక్కువ బరువుగా వుండటం వల్ల  ట్రాఫిక్‌లో డ్రైవింగ్ ని సులభతరం చేసె అవకాశం వుంది.

ఓలా ఎస్ 1 TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే (ఇంటిగ్రేటెడ్ నావిగేషన్‌తో), డిస్క్ బ్రేక్‌లు, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్ వంటి చాలా ఆకట్టుకునే ఫీచర్లతో నిర్మించబడింది. ఇందులో డ్రైవింగ్ సౌండ్‌ను ఎనేబుల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది. అంతేకాకుండా అదనపు సౌలభ్యం కోసం, రివర్స్ మోడ్ కూడా ఉంది. 

Ola బ్యాటరి   సాధారణ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేయడానికి దాదాపు 4.5 గంటలు పడుతుంది. భవిషత్తులో హైపర్‌ఛార్జర్ కేవలం 18 నిమిషాల్లో బ్యాటరీకి 75 కి.మీ. మైలేజి ని ఇస్తుంది.  

మరోవైపు, హోండా యాక్టివా ఫీచర్ల జాబితాను ఇలా ఉంది. 

ఇది ఉక్కు చక్రాలను కలిగి, రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌ల సాంకేతికతను కలిగి వుంది. 

అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సస్పెన్షన్, ఆల్-ఎల్ఈడి లైటింగ్, మొదలైనవి ఉన్నాయి. ఇంధనం నింపాల్సిన ప్రతిసారీ సీటు తెరిచి ఉంచాల్సిన అవసరం లేదు. 

హోండా యాక్టివా 6 జి ఇంజిన్ సైజు 109.51చ్చ్ ఇంజిన్ టైప్ ఫోర్ స్ట్రోక్, కూల్డ్ ఫ్యాన్, సింగిల్ సిలిండర్, పెట్రోల్ మాక్స్. ఫవర్ 7.79  మాక్స్. 

ఇక ధరల విషయానికి వస్తే..

హోండా యాక్టివా ధర(భారతీయ మార్కెట్లో ) ప్రస్తుతం రూ. 69,080 నుండి రూ. 72,325 వరకూ ఉంది. 

ఓలా ఎస్ 1,  విషయానికొస్తే, వాటి ధర రూ. 85,099, ఎస్ 1 ప్రో రూ.  1.10 లక్షలు (పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ).


బూస్టర్ డోసుతో కరోనా మటాష్!

blog/post/edit/4450771144974125185/1326888187400588969


 కోవిడ్-19 వ్యాక్సీన్‌ బూస్టర్ డోసు తీసుకున్న 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు తిరిగి కరోనా సోకడం, లేదా తీవ్ర అనారోగ్యం పాలవడం లాంటి సమస్యలు ఎదురుకావడం చాలా తక్కువని పరిశోధనల్లో తేలింది.

పైజర్-బయోటెక్ సంయుక్తంగా పరిశోధన చేసి, తయారు చేసిన నివేదికలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.

ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వశాఖ నుంచి అందిన సమాచారం  ప్రకారం 'ఫైజర్ వ్యాక్సీన్‌' రెండు డోసుల టీకా తీసుకున్న తరువాత మూడవ డోసు కూడా తీసుకోవడం వలన అత్యధిక రక్షణ లభిస్తున్నదని తేలింది. 

మూడవ డోసు వాక్సిన్ వేసుకున్న వారిని పరీక్షించిన అనంతరం వైద్య నిపుణులు ఈ విషయాన్ని ప్రకటించారు. 

60 ఏళ్లు పైబడిన వృద్దులు  టీకా మూడవ డోసు తీసుకుంటే వారికి కరోనా నుంచి నాలుగింతల రక్షణ లభిస్తున్నదని గుర్తించారు.

కరోనా మూడోవేవ్ వస్తోంది!

 

blog/post/edit/4450771144974125185/8301423265179588905


నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడిఎం) నిపుణుల కమిటీ మూడో వేవ్ కరోనా గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.

అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి చేరవచ్చని, ముఖ్యంగా పిల్లలపై ప్రభావం వుండొచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్‌లో రావచ్చు. ప్రత్యేకించి పెద్దలకంటే, పిల్లలు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం వుంది కాబట్టి వారి చికిత్స కోసం వైద్యపరంగా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కమిటీ పేర్కొంది. 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటి పిల్లలు, వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాల చికిత్స సౌకర్యాలు ఉదా: వెంటిలేటర్లు, అంబులెన్సులు మొదలైనవి అందించాలని, అంచనా వేసిన దానికంటే ఎక్కువ మంది పిల్లలు కరోనావైరస్ సంక్రమణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని  ప్రధాన మంత్రి కార్యాలయానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

పిల్లలకు కోవిడ్ టీకాలు వేయడానికి కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాలని, తీవ్రమైన అనారోగ్యాలు,  వైకల్యాలున్న పిల్లలకు టీకాలు వేయించాలని కమిటి సూచించింది. 

అక్టోబర్ చివరి నాటికి కరోనా మూడవ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు.