అత్యంత చవకైన స్మార్ట్ఫోన్ త్వరలో జియోఫోన్ నెక్ట్స్..!!
రిలయన్స్ జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీయనుంది.
ప్రపంచంలో అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ jio phone nextను సెప్టెంబర్ 10న ముఖేష్ అంబానీ మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించిన కంపెనీ ఈ ఫోన్కి ప్రీ బుకింగ్స్ పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు జియో వర్గాలు చెబుతున్నాయి.
ఫోన్ ధర ఎంతంటే..
గత జూన్ నెలలో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈఫోన్ ఫీచర్లు, ధర ఎంత ఉంటుందనే దానిపై అధికారకమైన సమాచారం లేనప్పటికీ ఈ ఫోన్ రూ.3,500 వుండొచ్చని తెలుస్తోంది.
ఈ ఫోన్ ఫీచర్స్..
జియో ఫోన్ నెక్స్ట్ 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్, 2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
టెలికాం రంగంలో మొదటి స్థానంలో ఉన్న జియో తన యొక్క యూజర్లను పెంచేందుకుగాను రూరల్ ఇండియాని టార్గెట్ చేస్తూ గూగుల్తో కలిసి తక్కువ ధరలోనే ఈ జియోఫోన్ నెక్ట్స్ ను మార్కెట్ లో విడుదల చేయనుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి