google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఇక ముగ్గురేసి పిల్లల్ని కనొచ్చు! CHINA

21, ఆగస్టు 2021, శనివారం

ఇక ముగ్గురేసి పిల్లల్ని కనొచ్చు! CHINA

 

china


చైనాలో జంటలు ఇక ముగ్గురేసి పిల్లల్ని కనొచ్చు. 

ఈ మేరకు అధికార కమ్యూనిస్టుపార్టీ తెచ్చిన ప్రతిపాదనకు దేశ పార్లమెంటు 'నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌' లోని స్థాయీ సంఘం శుక్రవారం లాంఛనంగా ఆమోదముద్ర వేసింది. 

ఇందుకు అనుగుణంగా జనాభా,కుటుంబ నియంత్రణచట్టాన్ని ఫార్లమెంట్ సవరించింది. 

గత దశాబ్ధకాలంలో పొరుగుదేశం భారత్ లో జనాభా తమ దేశం కంటే వేగంగా పెరుగుతుండటం, అలాగే చైనాలో  వేగంగా తగ్గిపోతున్న జననాల రేటును దృష్టిలో పెట్టుకుని ఈ చట్టాన్ని ముందుకు తీసుకువచ్చారు.

పెరుగుతున్న ఖర్చుల వల్లగాని, అధిక సంతానం పట్ల దంపతుల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేఖతను తగ్గించడానికి చైనా  ఈ చట్టంలో అనేక సామాజిక, ఆర్థిక తోడ్పాటు చర్యలను ప్రకటించింది.

 కుటుంబాలపై పడే ఆర్థికభారం, పిల్లల్ని పెంచడానికి, చదువు చెప్పించడానికి అయ్యే వ్యయాలకోసంగాను  ప్రభుత్వం ఆర్థికసాయం, పన్నులు, బీమా, విద్య, గృహ నిర్మాణం, ఉపాధి వంటి అంశాల్లో పలు ఉపశమన చర్యలను   చేపడుతుంది. 

దీర్ఘకాల జనాభావృద్ధిని ప్రోత్సహించడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

దాని ప్రకారం ఇద్దరు పిల్లల విధానాన్ని సడలించాలని, ముగ్గురు పిల్లల్ని కనేందుకు అనుమతించాలని సూచించింది. 

2016 కు ముందు దశాబ్దాల పాటు చైనాలో ఏక సంతాన విధానం ఉండేది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి