ఈ మధ్య కాలంలో బ్లాక్ వాటర్ గురించి ఎక్కువగా వినపడుతోంది.
సెలిబ్రిటీలు లేదా ఆరోగ్యంపట్ల ఎక్కువగా స్పృహ వున్నవాళ్ళు ఈ వాటర్ని తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హీరోయిన్ శ్రుతిహాసన్, బాలీవుడ్ నటి మలైకా ఆరోరా ఎప్పటి నుంచో ఈ నలుపు నీళ్లు తాగుతున్నారు.
సోషల్ మీడియాలో బ్లాక్ వాటర్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. బ్లాక్ వాటర్ స్పెషల్ ఏంటి? ఈ నలుపు నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? ఈ వాటర్ ధర ఎంత? అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.
సాధారణంగా మనం తాగే మినరల్ వాటర్ ఖరీదు ఒక లీటర్కు రూ.20 నుంచి 30 వరకు ఉంటుంది. కానీ దానికి మూడింతలు ధరతో బ్లాక్ వాటర్ లభిస్తుంది. లీటర్ బ్లాక్ వాటర్ బాటిల్కు దాదాపు రూ. 100 ఉంటుంది.
ఈ వాటర్లో ఆరోగ్యానికి సంబంధించి పలు ఉపయోగాలు దాగున్నాయి.
లీటర్ బ్లాక్ వాటర్లో 70 మినరల్స్ ఉంటాయి. అవి జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. ఈ వాటర్ తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. దాంతో పాటు మెటబాలిజం పెంపొందిస్తుంది. అలాగే అసిడిటీ ప్రాబ్లెం రాకుండా చూసుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వీటన్నింటితోపాటు వయసు కనపడకుండా నిత్య యవ్వనంగా కనిపించేలా చేసే పోషకాలు ఈ బ్లాక్ వాటర్ లో ఉంటాయట,
ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే సెలబ్రిటీలు ఈ వాటర్ తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి