google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఆఫ్ఘనిస్తాన్ లో విషాదం

16, ఆగస్టు 2021, సోమవారం

ఆఫ్ఘనిస్తాన్ లో విషాదం




 ఆఫ్ఘనిస్తాన్‌ని తాలిబాన్లు ఆక్రమించుకోవడంతో  పెద్ద సంఖ్యలో ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారు. 

ఓ వైపు గృహదహనాలు, లూటీలు జరుగుతుండంతో  ప్రాణాలు అరచేత్తో పట్టుకుని దేశం విడిచిపోతున్న ప్రజలు ప్రమాదకర పరిస్థితులలో ప్రాణాలు కోల్పోతున్నారు.

 కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరిన విమానం నుంచి ముగ్గురు ప్రయాణికులు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. వీరంతా విమానం లోపల చోటు లభించక పోడంతో  విమానం రెక్కలపై కూర్చున్నారు. విమానం గాలిలో టాకాఫ్ అయిన కాసేపటికే వారిలో ముగ్గురు కింద పడిపోయారు. 

ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు మీడియాలో ప్రముఖంగా ప్రసారం చేయబడుతోంది.

విమానాశ్రయంలోనే జరిగిన తొక్కిసలాట వల్ల ఏర్పడిన కాల్పుల సంఘ్ సంఘ్టనలో మరో ఐదుమంది మరణించారు.

 తాలిబన్లు రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. దేశం విడిచి వెళ్లడానికి ప్రజలు విమానాశ్రయానికి పరగులు పెడుతున్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి