మొబైల్ తయారీ సంస్థ మోటరోలా(Motorola) ఈ మధ్య కాలంలో విడుదల చేసిన మోటరోలా ఎడ్జ్ సిరీస్
ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 లైట్, ఎడ్జ్ 20 ఫ్యూజన్, ఎడ్జ్ 20 ప్రో వరుసక్రమంలోనే ఇప్పుడు అమెరికాలో మరో కొత్త మోడల్ను ఎడ్జ్ 2021 మోడల్ను ఆవిష్కరించింది.
మోటరోలా ఎడ్జ్ 2021 సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. 8జీబీ ram /256gb స్టోరేజ్ మోడల్ $ 500 రూ. ధర వద్ద రిలీజైంది.
అయితే ఈ ప్రారంభపు ఆఫర్ ముగియడంతో ప్రస్తుతం ఇది $700 (సుమారు రూ. 52,000) ధర వద్ద అందుబాటులో ఉంది.
మోటరోలా ఎడ్జ్ 2021 స్పెసిఫికేషన్లు
మోటరోలా ఎడ్జ్ 2021 స్మార్ట్ఫోన్ 6.4 -అంగుళాల ఫుల్ HD ప్లస్ LCD ప్యానెల్తో వస్తుంది.
ఇది స్నాప్డ్రాగన్ 778G SOC ప్రాసెసర్తో పనిచేస్తుంది. దీనిలో 8GB RAM, 256 జీబీ స్టోరేజ్ వుంది. ఇది 30W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000 MAH బ్యాటరీతో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, దీని వెనుకవైపు ఇందులో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ కెమెరాలతో ట్రిపుల్-కెమెరాని అందించింది.
ఇక, 32 MP ఫ్రంట్ కెమెరాను కూడా చేర్చింది.
ఎడ్జ్ 2021 లో 4జీ సపోర్ట్, వైఫై 6,5జీ, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ వంటివి అందించింది. ఇక దీనిలోని సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ IP52 రేటింగ్ను కలిగి ఉంటుంది.
ప్రస్తుతానికి, మోటరోలా ఎడ్జ్ 2021 అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరికల్లా కెనడాలో లాంచ్ అవుతుంది. భారత్తో సహా ఇతర దేశాల మార్కెట్లో లాంచింగ్పై ఎటువంటి వివరాలు ఇంకా తెలియరాలేదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి