మార్కెట్లో పోటీని తట్టుకునేందుకుగాను ఎప్పటికప్పుడు వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ తీసుకొస్తోంది.
యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసేందుకుగాను ఫెసిలిటీ కల్పించిన వాట్సాప్, తజాగా పేమెంట్ చేసే క్రమంలో న్యూ ఫీచర్ను తీసుకొచ్చింది. అదేంటంటే, పేమెంట్స్ చేసేటపుడు అందుకు తగ్గిన భావాన్ని కూడా ఇమేజ్ లేదా, ఇతర థీం రూపంలో చెప్పే సౌలభ్యం వుంటుంది.
ఇప్పటికే గూగుల్ పే యాప్లో పేమెంట్తో పాటు బ్యాక్ గౌండ్లో అందుకు తగ్గ భావాన్ని తెలిపేలా థీమ్ లేదా ఇమేజ్ కూడా జతచేసే ఫీచర్ వుంది. అలానే వాట్సాప్లోనూ పేమెంట్ చెల్లింపుతో పాటుగా థీమ్ కూడా సెండ్ అయ్యేలా అప్డేట్ తీసుకొచ్చింది.
కానీ ఈ థీమ్ను కేవలం ఇండియాలోని వాట్సాప్ యూజర్స్కు మాత్రమే అందుబాటులో తీసుకురావడం విశేషం.
వినియోగదారులు మనీ సెండ్ చేసే సమయంలో బ్యాక్గ్రౌండ్ థీమ్ ద్వారా తమ ఎక్స్ప్రెషన్స్ కూడా వ్యక్తపరచొచ్చని వాట్సాప్ తెలిపింది.
ఇకమీదట సందర్భాన్నిబట్టి బ్యాక్ గ్రౌండ్ థీమ్ను ఎంచుకొని యూజర్స్ తమ భావాన్ని తెలుపొచ్చు.
ఇలా వాట్సాప్ వినియోగదారులు మనీతో పాటు థీమ్ సెండ్ చేయడం ద్వారా అనుభూతులు, భావాలను కూడా పంచుకున్నట్లు అవుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి