జైడస్ క్యాడిలాZydus సంస్థ తయారు చేసిన 'జైకోవ్ డి కోవిడ్ వ్యాక్సిన్'ZyCoV-D ఎమర్జెన్సీ వినియోగానికి భారత్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
భారత్లోనే తయారైన ఈ వ్యాక్సీన్కి డ్రగ్ రెగ్యులేటర్ నుంచి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (EUA) అన్నీ అనుమతుల్నీ మంజూరుచేసింది.
ఈ వ్యాక్సిన్ను పెద్దలకే కాదు,12 నుంచి 18 సంవత్సరాల మధ్య గల పిల్లలకి కూడా ఉపయోగించవచ్చు.
పిల్లల కోసం అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి భారతీయ వ్యాక్సిన్గా దీన్నిచెప్పుకోవచ్చు.
ఈ వ్యాక్సిన్ ద్వారా దేశం కరోనాతో పూర్తి స్థాయిలో పోరాడుతోందని ప్రధాని మోడి ప్రకటించారు.
భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్, జైడస్ క్యాడిలా ఉత్పత్తి చేసిన 'జైకోవ్ డి ' ZyCoV-D ఈ రెండు వ్యాక్సీన్లు మాత్రమే భారత్లో పిల్లలపై ప్రయోగాలు చేస్తున్నాయి.
భారత్లోనే తయారుచేయబడిన రెండో వ్యాక్సీన్ ఇది.
ఈ వ్యాక్సీన్ ని పెద్దలు, 12 సంవత్సరాల కంటే పెద్ద పిల్లలు తీసుకోవచ్చు.
ఈ 'జైకోవ్ డి' వ్యాక్సీన్ మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకు రెండో డోస్ ఆ తర్వాత 56వ రోజు మూడో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ వ్యాక్సీన్ లో మరొక విశేషం ఏంటంటే అన్ని వ్యాక్సీన్లలా ఇంజెక్షన్ రూపంలో కాకుండా, పెయిన్ లెస్ ఇంట్రాడర్మల్ అప్లికేటర్ ద్వారా వేస్తారు.. సూది ఉండదుకాబట్టి పిల్లలకు నొప్పితెలియకుండా ఈ వ్యాక్సీన్ ఇవ్వొచ్చు.
కాగా ఈ వాక్సిన్ ని 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్యలో దీన్ని నిల్వ చేయాల్సి ఉంటుంది.ఈ వ్యాక్సీన్ ధర ఇంకా నిర్ణయించలేదు.
ఆగస్టు నుంచి డిసెంబర్ లోపల 216 కోట్ల వ్యాక్సీన్ డోసులు సిద్ధమవుతాయని Zydus కంపెని ప్రకటించింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి