google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: కరోనా మూడోవేవ్ వస్తోంది!

24, ఆగస్టు 2021, మంగళవారం

కరోనా మూడోవేవ్ వస్తోంది!

 

blog/post/edit/4450771144974125185/8301423265179588905


నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐడిఎం) నిపుణుల కమిటీ మూడో వేవ్ కరోనా గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.

అక్టోబర్‌లో గరిష్ట స్థాయికి చేరవచ్చని, ముఖ్యంగా పిల్లలపై ప్రభావం వుండొచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్‌లో రావచ్చు. ప్రత్యేకించి పెద్దలకంటే, పిల్లలు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం వుంది కాబట్టి వారి చికిత్స కోసం వైద్యపరంగా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కమిటీ పేర్కొంది. 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఏర్పాటు చేసిన ఈ కమిటి పిల్లలు, వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాల చికిత్స సౌకర్యాలు ఉదా: వెంటిలేటర్లు, అంబులెన్సులు మొదలైనవి అందించాలని, అంచనా వేసిన దానికంటే ఎక్కువ మంది పిల్లలు కరోనావైరస్ సంక్రమణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని  ప్రధాన మంత్రి కార్యాలయానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది.

పిల్లలకు కోవిడ్ టీకాలు వేయడానికి కేంద్రం ప్రాధాన్యం ఇవ్వాలని, తీవ్రమైన అనారోగ్యాలు,  వైకల్యాలున్న పిల్లలకు టీకాలు వేయించాలని కమిటి సూచించింది. 

అక్టోబర్ చివరి నాటికి కరోనా మూడవ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి