కోవిడ్-19 వ్యాక్సీన్ బూస్టర్ డోసు తీసుకున్న 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు తిరిగి కరోనా సోకడం, లేదా తీవ్ర అనారోగ్యం పాలవడం లాంటి సమస్యలు ఎదురుకావడం చాలా తక్కువని పరిశోధనల్లో తేలింది.
పైజర్-బయోటెక్ సంయుక్తంగా పరిశోధన చేసి, తయారు చేసిన నివేదికలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.
ఇజ్రాయెల్ ఆరోగ్యమంత్రిత్వశాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం 'ఫైజర్ వ్యాక్సీన్' రెండు డోసుల టీకా తీసుకున్న తరువాత మూడవ డోసు కూడా తీసుకోవడం వలన అత్యధిక రక్షణ లభిస్తున్నదని తేలింది.
మూడవ డోసు వాక్సిన్ వేసుకున్న వారిని పరీక్షించిన అనంతరం వైద్య నిపుణులు ఈ విషయాన్ని ప్రకటించారు.
60 ఏళ్లు పైబడిన వృద్దులు టీకా మూడవ డోసు తీసుకుంటే వారికి కరోనా నుంచి నాలుగింతల రక్షణ లభిస్తున్నదని గుర్తించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి