మధుమేహం ఉన్నవారు ఏం తినాలి?
ఈరోజు WHO లెక్కలప్రకారం దాదాపు 45 కొట్ల మందికి పైగా డయాబెటిక్ Diabetic పేషంట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
ఇందులో ప్రతి సంవత్సరం 10 లక్షలమందికి పైగా సుగర్ వ్యాధి వలన మరణిస్తున్నారు.
చికిత్స తప్ప, నివారణ పూర్తిగా లేని ఈ వ్యాదిని అదుపులో ఉంచుకోవడానికి, కొన్ని ఆహారపదార్థాలు ఉన్నాయి.
ఇవి బ్లడ్లో షుగర్ లెవల్స్ sugar level ను అదుపులో ఉంచుతాయి.
డయాబెటిక్ పేషంట్లు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం కాబట్టి వ్యాధి వల్ల వచ్చే గుండె సంబంధిత సమస్యలు, హార్ట్ స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, అంధత్వం మొదలైన వాటి ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే కష్టమైనా సరే కొన్ని తినాల్సివస్తుంది.
చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించే ఆహారాలను సుగర్ పేషంట్లు తరచూ గా తీసుకుంటూ ఉండాలి.
అలాంటి కొన్ని ఆహారపదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్, ట్రైటెర్పెనాయిడ్స్ Flavonoids , Glycosides, Triterpenoids అనే రసాయనాలు వేపలో ఉంటాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ అదుపుచేయడంలో సహాయపడతాయి. వేపను రోజుకు రెండుసార్లు పొడి రూపంలో తీసుకోవచ్చు లేదా టీ, గోరువెచ్చని నీటితో నైనా కలిపి తీసుకోవచ్చు.
మధుమేహంతో భాదపడేవారికి కాకరకాయ రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో చరాటిన్, మోమోర్డిసిన్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి.
అలాగే మన వంటగదిలో నిత్యం కనిపించే అల్లం లెక్కలేనన్ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇన్సులిన్ insulin ని నియంత్రించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఇలాంటిదే మరొకటి నేరేడు పండు. దీనిలో జామోబోలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఈ పండు యొక్క విత్తనం కూడా సుగర్ నియంత్రణలో అత్యంత ప్రభావాన్ని చూపుతుంది.
శరీరంలో గ్లూకోస్ టాలరెన్స్ glucose tolerance ని మెరుగుపరచడంలో మెంతి కూర కూడా సహాయపడుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
వీటికితోడుగా ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా, వాకింగ్, లాంటివి కలిగివుంటే సుగర్ వ్యాదిని అదుపులో వుంచుకోవడం సాధ్యమవుతుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి