‘‘పీవోకేలో మోది ఏం చేశారో, ఇప్పుడు ముజాహిదీన్లు కశ్మీర్లో అదే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు..ఇప్పుడు టైం ముజాహిదీన్లది., ఆయన ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల'ని జమాత్-ఉద్-దవా చీప్, ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయాద్ తీవ్రంగా హెచ్చరించాడు.
ఆదివారం పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహించిన ర్యాలీలో హఫీజ్ మాట్లాడుతూ భారత్పై తన అక్రోశాన్ని ప్రదర్శించాడు. భారత్ జరిపిన సర్జికల్ దాడులకు కశ్మీర్లో ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రజల సమక్షంలో తేల్చి చెప్పాడు. . ‘‘భారత్పై ముజాహిదీన్లు జరిపే సర్జికల్ దాడులు ఎలా ఉంటాయంటే జీవితాంతం గుర్తుండిపోతాయి. భారత్ జరిపినట్టు ఉండవు, ప్రపంచం కూడా ఇటువంటి దాడులను ఊహించలేదు’’ అని సయీద్ హెచ్చరించాడు.
కాగా.. కొద్దిరోజుల క్రితం హఫీజ్ పాక్ ప్రధాని నవాజ్పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి