పెద్దనోట్ల రద్దుతో.. కోట్ల కొద్దీ బ్లాక్ మనీ ఉన్నవారు ఆ డబ్బు ఏంచేయాలో తెలీక, నోట్ల కట్టల్ని చించి పారేస్తున్నారు, మరికొంతమంది గుట్టలుపోసి కాల్చేస్తున్నారు.
తాజాగా అస్సోంలోని భరాలు నదిలో ఏకంగా రూ.3.5 కోట్ల నగదును ముక్కలుగా చించి పారేశారు. రూ.500, రూ.1000 నోట్ల ముక్కలు నది సమీపంలోని నారెంగి రైల్వేస్టేషన్ డ్రెయిన్లో కొట్టుకురావడం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇవి నిజమైనవా కావా.. అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి