పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నాడు.
ఈ చర్య వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని అభిప్రాయ పడ్డారు.
‘నీతి లెక్చర్స్ సిరీస్ : పరివర్తన చెందుతున్న భారతదేశం’ అనే అంశంపై జరిగిన సదస్సులో బిల్ గేట్స్ మాట్లాడుతూ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడాన్ని సమర్థించారు.
ఈ పరిణామం వల్ల రాబోయే కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయన్నారు. డిజిటలైజేషన్ జరిగిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారతదేశం రూపొందుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి