పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రథాని మోదిపై నిప్పులు కురిపించింది.
వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ట్విటర్ వేదికగా గట్టిగా డిమాండ్ చేసింది. ఇదొక భారీ నల్ల కుంభకోణంగా మారిందని మమత అనింది. దీనివల్ల సామాన్య ప్రజానీకం కష్టాలు పడ్తొందని, మనీ లాండరర్లకే పూర్తి ప్రయోజనం కలుగుతోందని ఆమె విమర్శించింది.
సామాన్యులకు వ్యతిరేకమైన ఈ ‘నల్ల’ రాజకీయ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మమత డిమాండ్ చేసింది. భారత్ లో మార్కెట్లు కుప్పకూలిపోయాయని, ప్రజలు బాధపడుతున్నారని ఆమె పేర్కొంది.
అయితే మమత బెనర్జీ వ్యాఖ్యలను బీజేపీ విమర్శించింది. అవినీతిపరులకు కాంగ్రెస్, ఆప్, టీఎంసీ పార్టీలు అండగా నిలుస్తున్నాయని ఆరోపించింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి