google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: విలువైన ఉక్కు ఏపి కి దక్కింది!

8, నవంబర్ 2016, మంగళవారం

విలువైన ఉక్కు ఏపి కి దక్కింది!




పోలవరం ముంపు మండలాల్లోని కుకునూరులో వేల కోట్ల విలువైన ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు తేలింది.

విభజన ప్రక్రియలో భాగంగా ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో చేరడంతో వేల కోట్లు విలువచేసే ఖనిజం ఆంధ్రాకి దక్కినట్టైంది.

కుకునూరులో 2.35 లక్షల నుంచి 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఐరన ఓర్‌ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ గనులను విశాఖ ఉక్కుకు కేటాయించడానికి వీలుగా కేంద్రం అంగీకారం కూడా వ్యక్తం చేసింది. ఏపీఎండీసీ, విశాఖ ఉక్కు సంయుక్త భాగస్వామ్యంతో ఈ ఉక్కుపై హక్కును పొందనున్నాయి.

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో ఒక్కటైన కుకునూరు ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో ఉంది.  ఈ మండలాలతో విస్తారమైన అటవీ ప్రాంతం, నదీ వనరులతో బాటుగా ఇప్పుడు ఇనుపనిక్షేపాలు కూడా ఏపీ జాబితాకే చేరాయి.

ఈ నిక్షేపాలని విశాఖ ఉక్కుకు కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి