రాయలసీమతోపాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ డిమాండ్ చేశారు.
ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విభజన బిల్లు పెట్టినప్పుడు అసెంబ్లీలో తాను ఈ ప్రస్తావన తీసుకొచ్చానని గుర్తు చేశారు
మిగతా జిల్లాలతో పోలిస్తే అభివృద్ధిపరంగా రాయలసీమ జిల్లాలు వెనుకంజలో ఉన్నాయని చెప్పారు. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి జరగాలంటూ ఉద్యమాలు చేసినా ప్రజలు పట్టించుకోలేదని జయప్రకాశ్ వాపోయారు.
ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ఎవరి సొత్తు కాదని, రాయలసీమకు నికర జలాలు పోలవరం ప్రాజెక్టు నుంచే రావాలన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి