రూ.500, 1000 నోట్ల రద్దు నిర్ణయం నల్లకుభేరుల్ని కోలుకోలేనంత దెబ్బ తీస్తున్నట్టు కనిపిస్తోంది. మార్చుకునే వీలులేక, దగ్గరుంచుకుంటే ఉపయోగం లేకపోవడంతో కొంతమంది నోట్లను పెద్దమొత్తాలో తగలబెట్టేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో గోతాల్లో నింపి తగలబెట్టిన రూ.1000, రూ.500 నోట్లను గుర్తించారు. సీబీ గంజ్లోని పర్సా ఖేడా రోడ్లో గోతాల్లో వేసి మసి అయిపోతున్న కరెన్సీ కట్టలను కనుగొన్నారు.
ఓ పెద్ద కంపెనీకి చెందిన ఆ నోట్లను ముందుగా ముక్కలు చేసి, తర్వాత తగలబెట్టారని పోలీసులు తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి