కేంద్ర ప్రభుత్వ తీరుతో తనకు సైటొచ్చేసిందని పవన్ చలోక్తి విసిరాడు
అనంతరపురంలో జరిగిన ' సీమాంధ్ర హక్కుల చైతన్య సభ' లో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తన ఉపన్యాసం మధ్య మధ్యలో కాగితాల సహాయం తీసుకున్నపుడు, పవన్ కళ్ళద్దాల్ని ఉపయోగించాడు.
'సామాన్యులకు అర్థం కాని భాషను ఉపయోగించి ప్యాకేజ్ లెక్కలు చెప్పారని, దాని గురించి తెలుసుకోడానికి ఎన్నో పుస్తకాలు చదవడం వల్ల తనకు కళ్లు సరిగా కనిపించడంలేదని పవన్ అన్నారు. అలాగే ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నింటిని స్టడీ చేశానని, ఆర్థిక, సామాజిక రంగ నిపుణులతో చర్చించానని' పవన్ పేర్కొన్నారు.
తన కళ్లజోడుకు కేంద్రం గ్రాంటు మంజూరు చెయ్యాలని పవన్ వ్యంగ్యంగా కోరారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి