పెద్ద నోట్ల రద్దు విషయం సీఎం చంద్రబాబుకు ముందే తెలుసునని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించాడు.
విజయవాడలో శనివారం ఆయన ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ, టీడీపీ నేతలు తమ వద్దనున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న తర్వాతనే రూ.500, రూ.వెయ్యి నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసిందని చెప్పాడు.
నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని... విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని ఎందుకు తేలేకపోతున్నారని ఆయన ప్రశ్నించాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి