నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజా చార్జీల విషయంలో ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 24 వరకూ జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరాదని తెలిపింది.
వాస్తవానికి ఇది రేపటితో ముగియాల్సి ఉంది. వాహనదారులు చిల్లర కోసం ఇబ్బందులు పడుతుండటంతో పాటు టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి