పొట్టకూటి కోసం, వలస పోతున్న లిబియాకు చెందిన శరణార్థుల బతుకులు సముద్రంపాలయ్యాయి.
వారు ప్రయాణిస్తున్న రెండు పడవలు నీట మునిగిపోవడంతో, పెను విషాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 240 మంది జల సమాధి అయ్యారు. మృతుల్లో చిన్నారులు, గర్భవతులు, వృద్ధులు ఉన్నారు.
గస్తీదళాలు వీరిలో కేవలం 31 మందిని మాత్రమే రక్షించగలిగాయి. దశాబ్దాలుగా లిబియాలో సంక్షోభ పరిస్థితుల కారణంగా ఆ దేశం వీడుతున్నవారు తరచూ ప్రమాదాల్లో మరణిస్తున్నా.. ఒకేసారి ఇంత మంది చనిపోవడం ఇదే మొదటిసారి.
లిబియా తీరం నుంచి 40 మైళ్ల దూరంలో శరణార్థుల పడవలు వున్నపుడు ఈ పెనుప్రమాదం సంభవించింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి