షిర్డీ సాయిబాబా మీద, ద్వారక పీఠాధిపతి స్వరూపానంద చేస్తున్న వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. సవాళ్ళు, ప్రతి సవాళ్లతో ఇరువర్గాలు రేగిపోతున్నాయి.
నిన్న సాయిబాబాను భూతంగా అభివర్ణించిన స్వరూపానందను పిచ్చాసుపత్రిలో చేర్చాలని సాయి భక్తులు డిమాంద్ చేశారు.
సాయి దేవుడో కాదో తమను చర్చలకు పిలిస్తే, స్వరూపానంద నోరు మూయిస్తామని హైదరాబద్ దిల్సుఖ్నగర్ సాయి దేవస్థానం పెద్దలు సవాల్ విసిరారు. స్వరూపానందకే బూతం పట్టిందని, షిర్డీ సాయిపై అనుచిత వ్యాఖ్యలుచేస్తే చూస్తూ ఊరుకోమని, వారు హెచ్చరించారు. స్వరూపానందకు దమ్ముంటే తమతో చర్చలకు రావాలని, ద్వారకామయి సాయిబాబా పీఠం సభ్యులు కూడా సవాల్ విసిరారు.
భక్తి శాంతిదాయకం అని అంటారు., కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యి, భక్తి యుద్దకారకం అవుతోంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి