google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: పాకిస్థాన్‌లో ఉగ్రదాడి

25, అక్టోబర్ 2016, మంగళవారం

పాకిస్థాన్‌లో ఉగ్రదాడి



 పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు క్వెట్టాలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్ పై దాడిచేసి నరమేథం సృష్టించారు. ఈ దాడిలో వసతిగృహంలో ఉన్న 60 మంది ట్రైనీ పోలీసులు మృతి చెందగా, చాలామందికి గాయాలయ్యాయి.

సోమవారం రాత్రి 11గంటల సమయంలో ఈ దాడి జరిగింది. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నారని, భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. మిగిలిన ముగ్గురు ఉగ్రవాదులు ట్రైనీలను బందీలుగా చేసుకుని అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఉగ్రవాదులకోసం వెతుకుతున్నారు.

కాగా ఈ వసతి గృహంలో మొత్తం 600 మంది శిక్షణా పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో 250 మందిని ఇప్పటికే సురక్షితంగా బయటకు తెప్పించేసారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి