బ్యాంకులకు చెల్లించాల్సిన 9 వేల కోట్లకు పైగా రుణం ఎగ్గొట్టి గత మార్చి 2న భారత్ వదిలి పారిపోయిన మాల్యా, లండన్లో తలదాచుకుంటున్నాడు. అక్కడ కూడా ఆయన విలాసవంతమైన జీవితానికి ఢోకా లేనట్టే కనిపిస్తోంది.
అప్పులు తీర్చడం మాటెలావున్నా, విలాసవంతమైన జీవితం, తన మిత్రులకు పండుగల సందర్భంగా ఖరీదైన గిప్ట్లు పంపడం మాత్రం మాల్యా ఇప్పటికీ మానలేదట.
ఈ దీపావళి సందర్భంగా ఆయన తన సన్నిహితులకు యీబీ గ్రూప్ లోగోతో కూడిన బాక్సుల్లో బ్లాక్ లేబుల్ మద్యం బాటిళ్లను పంపించాడని తెలుస్తోంది. జర్నలిస్టు ఒకరు దానికి సంబందించి ఓ ఫోటోను ట్వీట్ చేశారు. అయితే ఈ గిఫ్టులు అందుకున్నారో, ఆయన స్నేహితులు ఎవరో అనేది మాత్రం స్పష్టం కాలేదు కానీ..ఖరీదైన ఈ మద్యం సీసాల్నే బహుమతులుగా పంపాడట. .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి