పవర్ స్టార్ మూవీ 'అత్తారింటికిదారేది ' లో ఐటం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చినా.. 'నో ' చెప్పిన యాంకర్ అనసూయ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరం తేజ్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించడానికి యస్ చెప్పిందట!
తాజా సమాచారం ప్రకారం సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'విన్నర్' లో అనసూయ ఐటం సాంగ్ లో మెరవబోతోందట. ఈ సినిమాకు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది..
'సోగ్గాడే చిన్నినాయన' లో నాగ్ తో ఆడి ప్రేక్షకుల్ని మురిపించిన జబర్దస్త్ బ్యూటి అనసూయ, తేజ్ తో కూడా జోడీ కట్టబోతోంది.
అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఐటం సాంగ్ లో నటించడానికి పవర్ స్టార్ కి ఎందుకు నో చెప్పినట్టు? సాయిధరం తేజ్ కి మాత్రం ఎందుకు ఓకే చెప్పినట్టు??
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి