దాదాపు ఒకటున్నర నెల తర్వాత, ఉరీ ఉగ్రదాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా ప్రకటించింది.
సెప్టెంబరు 18న తెల్లవారుజామున ఉరీ భారత సైనికస్థావరంపై లష్కరే ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.
ఈ ఆత్మాహుతిదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదులకు నిర్వహించబోయే అంతిమ కార్యానికి హాజరై, నివాళులు అర్పించాలని లష్కరే తోయిబా పాకిస్థాన్ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పాకిస్థాన్లోని గుజ్రన్వాలా ప్రాంతంలో గోడలకు పోస్టర్లు అంటించారు.
కాగా ఈ దాడికి పాల్పడింది మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహ్మద్ సంస్థగా భారత సైన్యం ప్రకటించివుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి