google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: మార్కెట్లో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.

29, ఆగస్టు 2021, ఆదివారం

మార్కెట్లో మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.

 

Simple Electric Scooter, electric schooter


ప్రస్తుతం విద్యుత్‌ ఆధారంగా నడిచే వాహనాల హవా నడుస్తోంది. 

ఈ క్రమంలోనే చాలా కంపెనీలు సైతం అధునాతన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లను తయారు చేస్తున్నాయి. 

ఈ జాబితాలోకి కొత్తగా చేరింది  "సింపుల్‌ ఎనర్జీ".

ప్రస్తుతం మార్కెట్లో ప్రజలు కూడా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల వినియోగంపై ఆసక్తి చూపిస్తుండడంతో  రోజుకో కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేస్తున్నాయి. 

తాజాగా మార్కెట్లోకి సింపుల్‌ ఎనర్జీ అనే స్టార్టప్‌ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. 

ఈ స్కూటర్‌లో 4.8 కిలోవాట్స్ గల పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని ఇచ్చారు. డిటాచబుల్‌, పోర్టబుల్‌ ఫీచర్‌తో సులభంగా బ్యాటరీ చార్జ్‌ చేసుకోవచ్చు. 

నిమిషం చార్జింగ్ చేస్తే 2.5 కిలోమీటర్లు వెళ్ళగలుగుతుంది.  పూర్తిగా చార్గింగ్  చేస్తే ఏకంగా 203 కిలో మీటర్లు వెళ్లొచ్చు. 

గంటకు 105 కి.మీల వేగంతో దూసుకుపోగలిగే ఈ స్కూటర్‌లో 7 అంగుళాల కస్టమైజబుల్ డిజిటల్ డ్యాష్ బోర్డ్, ఆన్ బోర్డ్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, ఎస్ఓఎస్ మెసేజ్, డాక్యుమెంట్ స్టోరేజీ, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు అందించారు. 

బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్‌  స్కూటర్‌ ధరను రూ. 1.10 లక్షలుగా నిర్ణయించింది. స్కూటర్‌ను రూ. 1947 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి