నటుడు, భారీచిత్రాల నిర్మాత, మరియు రాజకీయనేత బండ్ల గణేశ్ కథానాయకుడిగా మారబోతున్నారు.
తమిళంలో ఘనవిజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ 'ఒత్త సెరుప్పు అళవు7' (సింగిల్ స్లిప్పర్ సైజ్-7) మూవీని గణేష్ తెలుగులో రీమేక్ చేయబొతున్నారు.
తమిళంలో స్వీయదర్శకత్వంలో పార్థీబన్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా పలు అవార్డులను సొంతంచేసుకుంది.
ఈ సినిమాలో వున్న మరో విశేషం ఏంటంటే మూవీ మొత్తం ఒకే ఒక క్యారెక్టర్ వుంతుంది. కాగా ఈ సినిమాను హిందీలో అభిషేక్ బచ్చన్ రీమేక్ చేస్తుడటం గమనార్హం.
తెలుగు రీమేక్కు వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.
సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి