రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు వారి వారి అభిమానులు గుడులు కట్టించడం అనేవిషయం అప్పుడప్పుడూ మనం వింటూనే ఉంటాము.
ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్రలోని పుణేలో బీజేపీ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్రమోదీకి చిన్నసైజు దేవాలయం నిర్మించి, అందులో MODI గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు..
మహారష్త్ర పుణెకు చెందిన మయూర్ ముండే అనే మోడీకి విరాభిమాని, ప్రథానిపై తనకున్న అభిమానాన్ని చాటుతూ ఏకంగా రూ. 2 లక్షల రూపాయల ఖర్చుతో temple నిర్మించాడు.
ఇందు కోసంగాను మయూర్ జైపూర్ మార్బల్ను ఉపయోగించాడు.
మయూర్ మాట్లాడుతూ.. ఆయోధ్యలో రాముడికి దేవాలయాన్ని నిర్మించిన వ్యక్తికి ఓ దేవాలయం ఉండాలనేది నా భావన. అందుకోసమే మోదీకి ఆలయాన్ని నిర్మించాను’అని చెప్పుకొచ్చాడు.
కానీ ట్విస్ట్ ఏమిటంటే ఈ దేవాలయ విషయం పి.యం.ఓ కి చేరడంతో రాత్రికిరాత్రే విగ్రహాన్ని తొలగించేసారు.
ఆలయానికి సంబంధించిన వార్త మీడియాలో రావడంతో బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి