ప్రజల జీవనశైలిని మరింత స్మార్ట్ చేసే క్రమంలో, అధునాతన టెక్నాలజీతో షియోమీ సరికొత్త గ్యాడ్జెట్స్ ప్రవేశపెట్టింది.
XIAOMI షియోమి స్మార్ట్ లివింగ్ ఈవెంట్లో భాగంగా 6 ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఉత్పత్తులు ప్రజల జీవనశైలిని స్మార్ట్ చేయడానికి సహాయపడతాయని కంపెనీ చెబుతోంది.
ఇందులో భాగంగా Wi-Fi కనెక్టివిటీ కోసం Mi రూటర్ 4A, Mi 360 హోమ్ సెక్యూరిటీ కెమెరా, Mi TV 5x 3 సిరీస్, Mi స్మార్ట్ బ్యాండ్ 6 లను లాంచ్ చేసింది. వీటితోబాటుగా షియోమి షూలను కూడా విడుదల చేసింది
పై గాడ్జెట్స్ మొత్తం IOT టెక్నాలజి మీద ఆధారపడి పనిచేస్తాయి.
గాడ్జట్ ని ఇంటర్నెట్కు కనెక్ట్ చేయడం ద్వారా మన పనిని IOT సులభతరం చేస్తుంది. మరోవిధంగా చెప్పాలంటే షియోమి తయారుచేసిన అన్ని గాడ్జట్స్ ని ఇంటర్నెట్కు కనెక్ట్ చేయగలము., ఇవన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిజ్ణానం ఆధారంగా ఆపరేట్ కాబడుతాయి.
IOT అనేది నెట్వర్కింగ్ టెక్నాలజీపై పనిచేస్తుంది.
దీని సహాయంతో, మీరు మీ ఇంటిలోని పరికరాలను ఇంటర్నెట్ సహాయంతో కనెక్ట్ చేయవచ్చు. ఆ పరికరాలన్నీ ఎక్కడి నుండైనా పర్యవేక్షించవచ్చు.
షియోమి స్మార్ట్ ఈవెంట్లో లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఇలా వున్నాయి.
1. Mi రూటర్ 4A
ఇది 3 గిగాబైట్ నెట్వర్క్ పోర్ట్లను కలిగి ఉంటుంది. డ్యూయల్ కోర్ CPU, 4 హై గెయిన్ యాంటెన్నా అందుబాటులో ఉంటాయి. వీటి సహాయంతో, 1167 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులో ఉంటుంది.
2. Mi 360 హోమ్ సెక్యూరిటీ కెమెరా
ఈ కెమెరా డ్యూయల్ బ్యాండ్ వైఫై సిస్టమ్తో వస్తుంది. 2 రకాల వాయిస్ కాలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది F1.5 అపార్చర్ కలిగిఉంది. నైట్ విజన్ సెన్సార్ ఇంకా ఈ కెమెరా డ్యుయెల్ వే వాయిస్ కాలింగ్ సౌకర్యం ఉంది.
3. Xiaomi రన్నింగ్ షూస్
బ్లాక్, బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లతో Xiaomi రన్నింగ్ షూస్ కూడా ఈ ఈవెంట్లో లాంచ్ అయ్యాయి. ఇందులో PU హీల్ స్టెబిలైజర్, యాంటీ-ట్విస్ట్ సపోర్ట్ లేయర్, TPU ఫ్లెక్స్ యూనిట్, క్లౌడ్ బాంబ్ పాప్కార్న్ మిడ్సోల్, అల్ట్రా స్ట్రాంగ్ రబ్బర్ గ్రిప్ ఉన్నాయి. దీని ధర రూ .2,699 గా ప్రకటించారు.
4. Mi TV 5x సిరీస్
ఈ టీవీ 43, 50, 55 అంగుళాల స్క్రీన్ సైజు వేరియంట్లతో లాంచ్ అయింది. టీవీ స్టాండ్ మెటల్తో తయారైంది. బాడీ రేషియో 96.6%. ఇందులో 100 కోట్లకు పైగా కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలియజేసింది.
ఇందులో డాల్బీ విజన్, HDR10+, HDR 10, 40W స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. పేరంటల్ లాక్, మరియు సురక్షితమైన కంటెంట్ను వెతకడానికి ఆప్షన్ ఉంది. 15 భాషలు అందుబాటులో ఉంటాయి. అలాగే 30 OTT యాప్ల నుండి 75 కి పైగా ఉచిత లైవ్ ఛానెల్లు అందుబాటులో ఉంటాయి.
5. Miస్మార్ట్ బ్యాండ్ 6
80 కి పైగా పూర్తి స్క్రీన్ వాచ్ ఫేస్లు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్రూఫ్, రియల్ టైమ్ హార్ట్ బీట్ మానిటర్, SpO2 స్థాయి, నోటిఫికేషన్ అలెర్ట్ లను పంపవచ్చు. ఈ స్మార్ట్ బ్యాండ్లో మాగ్నెటిక్ ఛార్జింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంది. చార్జింగ్ చేసేటపుడు పట్టీని తొలగించాల్సిన అవసరం లేదు.Mi స్మార్ట్ బ్యాండ్లో 1.56-అంగుళాల AMOLED టచ్స్క్రీన్ డిస్ప్లే ఉంది. 30 ఫిట్నెస్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి.
6.మీ నోట్బుక్ అల్ట్రా షియోమి
షియోమీ ఇండియాలో రెండు కొత్త ల్యాప్టాప్లను విడుదల చేసింది. ఈ కొత్త ల్యాప్టాప్లు Mi నోట్బుక్ ప్రో, Mi నోట్బుక్ అల్ట్రా. ఈ సెకండ్ జనరేషన్ ల్యాప్టాప్ల ను గత సంవత్సరంMi నోట్బుక్ 14 కి అప్గ్రేడ్గా లాంచ్ చేశారు. ఈ కొత్త మోడల్స్ 3.2క్ డిస్ప్లే, 11 వ జెనరేషన్ ఇంటెల్ టైగర్ లేక్ ప్రాసెసర్ని కలిగి ఉంటాయి.
Mi నోట్బుక్ ప్రో ధర 8GB RAM మరియు కోర్ i5 ప్రాసెసర్ వేరియంట్కు రూ .56,999, 16GB RAM, కోర్ i5 ప్రాసెసర్కు రూ .59,999, అదేవిధంగా 16MB RAM , కోర్ i7 ప్రాసెసర్ వేరియంట్కు రూ .72,999 గా నిర్ణయించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి