సామ్సంగ్ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్సంగ్ తాజాగా మార్కెట్లోకి గ్యాలక్సీ A52S పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
సామ్సంగ్ గెలాక్సీ A52S 5జీ పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే అందించారు.
ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీని ప్రత్యేకత.
A52S 6జీబీ ర్యామ్ + 128జీబీ, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్లలో అందుబాటులోవుంటుంది.
మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు.
ఈ ఫోన్లో 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 4,5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్పై నడుస్తుంది.
6జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.35,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,499గా నిర్ణయించారు.
శాంసంగ్ A52s 5G స్మార్ట్ ఫోన్ సేల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి