సుఖనిద్ర కోసం కొత్త పరికరం!
ప్రస్తుత ప్రపంచంలో నిద్రలేమి సమస్యతో ఎన్నో కోట్ల మంది బాధపడుతున్నారు. మానసిక ఆందోళన, లేదా రాత్రి పూట మొబైల్ ఫోన్ ని ఎక్కువగా వినియోగిస్తుండటం కారణంగా నిద్ర అనేది కరువైపోతోంది.
దీనికి పరిష్కారంగా జర్మన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త పరికరాన్ని కనుగొన్నారు.
మైక్రో–కరెంట్ స్మార్ట్ హిప్నాసిస్ ఇస్ట్రుమెంట్ అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు హైటెక్నాలజీతో రూపొందించారు.
ఈ పరికరం ముఖ్యంగా తగినంత నిద్ర లేకుండా బాధపడేవారికి ఎంతగానో సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి నిద్రపుచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎలా పని చేస్తుంది?
ఈ డివైజ్ని చేతితో పట్టుకుని, రిలాక్స్డ్గా కళ్లు మూసుకుంటే చాలు., మెదడులోని కండరాలను ఉత్తేజపరచి, నిద్రపోయేలా చేస్తుంది.
ఈ డివైస్ చాలా మరియు తేలికైనది కూడా.
మైక్రో–కరెంట్ స్మార్ట్ హిప్నాసిస్ ఇస్ట్రుమెంట్ ని సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనిలో వర్కింగ్ మోడ్స్ ని కూడా అమర్చారు. తీవ్రతను పెంచడానికి లేదా తగ్గించడానికి ప్లస్ మైనస్ బటన్స్ కూడా ఉంటాయి.
ఈ స్లీప్ ఎయిడ్ పరికరాన్ని కార్యాలయాల్లో, ఇంట్లో, వ్యాపార పర్యటన ప్రాంతాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.
సుమారు 15 నిమిషాలు వాడితే, తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా నివారిస్తుందని చెబుతున్నారు.
ఈ డివైస్ చేతికి బ్రేస్లెట్లా వేసుకోవచ్చు.
ధర ఎంత?
దీని ధర సుమారు 30 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ లో సుమారు రూ. 2,200 వరకు ఉంటుంది.
సరైన నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అనేక రోగాలనుండి ఈ పరికరం కాపాడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి