లక్షలాదిమంది అభిమానులుల్ని శోకసంద్రంలో ముంచెత్తుతూ పురిచ్చితలైవి శాస్వతంగా అస్తమించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, అమ్మగా కోట్లాదిమందిచే ఆరాధించబడే జయలలిత నిన్నరాత్రి 11.30గం. లకు మరణించారు.
75 రోజులుగా చెన్నై అపోలో హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడిన జయ, చివరికి విధికి తలొంచారు.
జయలలిత పార్థివదేహానికి ఈ సాయంత్రం 4.30గం.లకు మెరీనాబీచ్ దగ్గర, తమిళప్రియతమ నేత, మాజీ సీయం, జయకు రాజకీయ గురువైన యం.జీ.ఆర్. సమాధి ప్రక్కనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
జయలలిత మృతికి పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేసారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి