పెరుగుతున్న పెట్రోల్ ధరలను ద్రృష్టిలో పెట్టుకోవడమే కాకుండా, వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించాలనే స్ప్రుహ కూడా ప్రజలలో కలుగుతూ వుండటంతో తయారీధారులు ఈమధ్య అటువంటి వాహనాలను ఉత్పత్తి చేయడానికే ప్రాథాన్యతను ఇస్తున్నారు.
ఇక వినియోగదారులను కూడా ఈ వాహనాలు ఆకర్షిస్తున్నాయి.
తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ 'సింపుల్ ఎనర్జీ' తన మొదటి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను స్వాతంత్ర దినోత్సవ కానుకగా లాంఛ్ చేయడానికి రెడీ అయ్యింది.
ఆగస్టు 15న ఎలక్ట్రిక్ స్కూటర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది.
ఈ స్కూటర్ కావాలనుకునే వినియోగదారులు కంపెనీ వెబ్ సైట్లో రేపు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఇందుకు గాను రూ. 1,947 చెల్లించాల్సి ఉంటుంది
ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల విషయానికి వస్తే టచ్ స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆన్ బోర్డ్ నావిగేషన్ సపోర్ట్ ఉన్నాయి. సింగిల్ చార్జ్ చేస్తే 240 కి.మీ మైలేజ్ ఇస్తుంది.
ధర రూ. 1,00,000 నుంచి రూ. 1,20,000 వరకు ఉంటుందని తెలుస్తోంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి