సినిమా విడుదలకు ముందే, ప్రేక్షకుల్ని సంబ్రమాశ్చర్యాలకు గురిచేయనున్నట్టు దర్శకుడు రాజమౌళి తెలియజేసాడు.
నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బాహుబలి ది కంక్లూజన్ కి సంబందించి లోగోని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ అనేక విషయాలు వెల్లడించాడు.
వర్చువల్ రియాలిటీ ద్వారా మాహిష్మతి సామ్రాజ్యాన్ని ప్రేక్షకుల కంటిముందుకే తీసుకొస్తున్నామని, దీనికి సంబందించి యానిమేషన్, గూగుల్ కార్డ్ కోసం 25కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు తెలియజేసాడు.
ఈనెల 5న ప్రభాస్ అభిమానులకోసం ఒక స్వీట్ న్యూస్ వుండబోతోందని,
ప్రభాస్ బర్త్ డే ఒకరోజు ముందుగా అంటే అక్టోబర్ 22న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందనీ చెప్పాడు.
టీజర్, ట్రైలర్ మాత్రం 2017 జనవరి లో వుండొచ్చని తెలుస్తోంది.
కాగా బాహుబలి కి ఇది మొదలు కాదు, చివరాకాదు అంటూ మూడో పార్ట్ కూడా వుండొచ్చు అనేలా ఊహాగానాలకు తావిచ్చేలా రాజమౌళి మాట్లాడారు.
ఈ సినిమా 2017 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలంటే అంతవరకు ఓపిక పట్టకతప్పదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి