తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరొగ్యపరిస్థితి మీద వదంతులు షికారు చేస్తున్నాయి.
హాస్పిటల్లో చేరి వారంరోజులు దాటినప్పటికీ, ఆమె హెల్త్ కండిషన్ గురించి అధికారికంగా ఎటువంటి వార్తలు ప్రభుత్వం తరపున రాకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
కాగా ప్రతిపక్ష డీ.యం.కే. అధినేత కరుణానిధి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చికిత్సకు సంబంధించి ఫోటోలు రిలీజ్ చెయ్యాలని, వారంరోజులైనా ముఖ్యమంత్రిని రాష్ట్ర గవర్నర్ ఎందుకు పరామర్శించలేదో తెలియజేయాలని డిమాండ్ చేసారు.
కాగా, వదంతులు సృష్టించేవారికి కఠిన శిక్షలు తప్పవని చెన్నై పోలీసుకమీషనర్ జార్జ్ హెచ్చరించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి