పుకార్లకు తెరదించుతూ, పురచ్చితలైవి ఆరోగ్యంగా వున్నారని, రెండుమూడురోజుల్లో డిస్చార్జ్ అవుతారనీ అన్నాడియంకే వర్గాలు తెలియజేసాయి.
యూకే డాక్టర్ల పర్యవేక్షణ లో డా.రిచర్డ్స్ చికిత్స చేస్తున్నారని, దానికి సంబందించి ఎలాంటి ఫోటోలు చూపించాల్సిన అవసరం లేదని, తాము ప్రజలకు మాత్రమే భాద్యత వహిస్తామని పరోక్షంగా డీ.యం.కే శ్రేణులను ఉద్దేశించి ప్రకటనను విడుదల చేసారు.
పుకార్లు సృష్ఠిస్తున్నారన్న కారణంతో 30మంది డీ.యం.కే కార్యకర్తలను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా, చెన్నై అపోలో హాస్పిటల్ ముందు భారీగా పోలీస్ బంధోబస్తు ఏర్పాటు చేసారు.
రెండురోజులుగా ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల కాకపోవడంతో రీగన్ యస్ బెల్ అనే న్యాయవాది, గవర్నర్ కలగజేసుకుని జయ ఆరోగ్యంపై ప్రకటన విడుదల చెయ్యాలని రాస్ట్రపతికి లెటర్ వ్రాసారు.
ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని అపోలో ముందు సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి