నిత్యం నిరసనలతో అట్టుడికే ఇథియోపియా లో మరోసారి వీథులు రక్తమోడాయి.!
వసంతంలో అడుగుపెట్టే కాలానికి సూచికగా ఒరోమో ప్రావిన్స్ అంతటా ‘ఇరీచా’ ఆధ్యాత్మిక వేడుక ప్రతీఎటా ఘనంగా జరుగుతుంది.
ఈ ఉత్సవం నిర్వహిస్తున్న ప్రజలపై ఒరోమోలో ఆదివారం మిలటరీ బలగాలు బాష్పవాయువు ప్రయోగించడంతోపాటు విచక్షణరహితంగా కాల్పులుజరపడంతో కనీసం 295 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, ప్రకటనలు చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వేడుకపై నిషేధాజ్ఞలు విధించింది. అయినా ప్రజలు పెద్దఎత్తున గుమికూడి ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పాటలు, నృత్యాలు కొనసాగించడంతో పోలీసులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు
ఇథియోపియా ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒరోమోలో చాలాకాలంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. రాజధాని అడిస్ అబాబాకు 40 కిలోమీటర్ల దూరంలోని బిష్పొతు నగరంలో ఈ దుర్ఘటన జరిగింది.
కాల్పులకు భయపడి ప్రజలు పారిపోతున్నపుడు తొక్కిసలాట జరగడం వల్లే ఎక్కువ మంది చనిపోయి వుండొచ్చని తెలుస్తోంది. ఎక్కడ చూసినా మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది.
కాల్పులు జరిగిన విషయాన్ని ఫెడరల్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఎంత మంది చనిపోయారో, గాయపడ్డారో సంఖ్య చెప్పలేదు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి