కరెంట్ షాక్ ప్రమాధం నుంచి, కాంగ్రెస్ యువనేత రాహుల్ తృటిలో తప్పించుకున్నాడు.
ఆగ్రాలో కిసాన్ ర్యాలీలో భాగంగా, అగ్రసేన్ విగ్రహానికి పూలమాల వేస్తున్నపుడు పైనవున్న విద్యుత్ తీగ చెవులకు రాసుకుంది, వెంటనే రాహుల్ తల క్రిందికి వంచడంతో పెనుప్రమాదం తప్పింది.
ఈ సంఘటనలో రాహుల్ కి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఆయన రావడానికి కొద్దిసేపుముందు కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకి అదే వైర్ వల్ల స్వల్పంగా షాక్ లు తగిలినట్టు తెలుస్తోంది.
ఈ సంఘటన తర్వాత రాహుల్ గాంధీ యధావిధిగా తన పర్యటనను ముగించుకుని వెళ్ళిపోయాడు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి