బ్యాటరీ వేడెక్కడం, పేలిపోవడం లాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో గెలాక్సీ నోట్ 7 విక్రయాలను శామ్సంగ్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.
ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాల నిలిపివేత వల్ల భారీ నస్టాలు రాబోతున్నాయని శామ్సంగ్ వెల్లడించింది. ఈ ఫోన్లను వెనక్కి రప్పించడం వల్ల మొత్తంగా సంస్థకు నస్టం రూ.35000 కోట్లు వుంటుందని తెలిపింది. .
సాంసంగ్ నోట్ 7 నేర్పిన గుణపాఠం వల్ల నాణ్యత ప్రమాణాల ప్రక్రియను మెరుగుపర్చుకునేందుకు, మార్పులను మొదలుపెట్టనున్నట్టు శామ్సంగ్ తెలిపింది.
ఇలా వుండగా గెలాక్సీ నోట్ 7 రీకాల్ ప్రభావంతో శామ్సంగ్ ఇండియా రూ.6,457 కోట్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని పరిశోధన సంస్థ సీఎంఆర్ వెల్లడించింది.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి